Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ లింకుల వ్యవహారం.. దొంగ దొరికాడు
Recommended Video
సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటి పూనమ్ కౌర్ల మధ్య ఏదో ఉందని.. లోలోపల ఈ ఇద్దరూ పెద్ద వ్యవహారమే నడుపుతున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా పూనమ్ కౌర్ చెప్పిన విషయాల వాయిస్ టేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వాయిస్ తనది కాదని, తనపై కుట్ర జరుగుతోందని అప్పట్లో పూనమ్, పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసు టేకప్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి పోతే..
పవన్ కళ్యాణ్తో పూనమ్ ఎఫైర్
తెలుగుతో పాటు తమిళ్, కన్నడలో కూడా పలు చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఎఫైర్ ఉందంటూ అప్పట్లో బాంబ్ పేల్చారు మూవీ క్రిటిక్ కత్తి మహేష్. ఈ వివాదంలో పూనమ్, కత్తి మహేష్ల మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం, మరోసారి పూనమ్ వ్యవహారం బయటకు రావడం లాంటి జరిగాయి.
సరిగ్గా ఎన్నికల సమయంలో పూనమ్ వాయిస్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ని చాలా మంది శతృమూకలు టార్గెట్ చేశారు. కత్తి మహేష్ వ్యాఖ్యలను ఆసరాగా చేసుకొని సరిగ్గా ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ వాయిస్ తో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ చేయాలని ప్రయత్నించారు. ఇది గమనించిన పూనమ్ సదరు వీడియోలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
అదే సమయంలో లక్ష్మీపార్వతి
దీంతో కేసు పరిశీలనలోకి సైబర్ క్రైం పోలీసులు.. పూనమ్ వాయిస్ టేపుల వ్యవహారంలో నిందితుడు లక్ష్మీపార్వతి ఇంట్లో పనిచేసిన కోటి అనే జూనియర్ ఆర్టిస్ట్ అని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆ సమయంలో లక్ష్మీపార్వతి తనను లైగికంగా వేధిస్తోందని కోటి చెప్పడంతో ఈ ఉచ్చు ఆమెకు కూడా చిక్కుకుంది. దీంతో కోటి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. కానీ ఈ సైబర్ నేరగాడి జాడ పట్టుకోవడం పోలీసులకు సాధ్యపడలేదు.
చివరకు నాంపల్లి కోర్టులో ప్రత్యక్షం
ఇన్నాళ్లు తప్పించుకు తిరిగిన కోటి చివరికు మంగళవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అయితే అతనిపై ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు.. ఈ కేసుతో పాటు కోటికి కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసుతోనూ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది.
లక్ష్మీపార్వతి, పూనమ్ కౌర్ లకు రిలాక్స్
గత రెండు మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న సైబర్ నిందితుడు కోటి.. ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో లక్ష్మీపార్వతి, పూనమ్ కౌర్లు ఊపిరి పీల్చుకున్నారు. తమపై వచ్చిన ఆరోపణలు అసత్యాలని ఇకనైనా జనం నమ్ముతారని వారు భావిస్తున్నారు.