Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేవుడు అవసరం లేదు.. ఆయన కంటే టెర్రరిస్టే బెటర్.. పూనమ్ కౌర్ పరోక్ష దాడి..
Recommended Video
ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్, సినీ నటి పూనమ్ కౌర్ లాల్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్గా తన గళాన్ని వినిపిస్తున్నారు. అప్పుడప్పుడు రాజకీయాల్లో, సమస్యలపై స్పందించే పూనమ్ కౌర్ తాజాగా పాలిటిక్స్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యక్తిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. పూనమ్ ఏమన్నారంటే..
మానవత్వం ఉంటే చాలూ
మన సమస్యలు పరిష్కరించడానికి దేవుడు అవసరం లేదు. ఎందుకంటే మన సమస్యలను మనుషులే సృష్టిస్తున్నారు. వాటిని పరిష్కరించడానికి మానవత్వం ఉన్న మనిషి చాలు అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. సదరు వ్యక్తి పేరు ట్వీట్లో ఎక్కడా ప్రస్తావించనప్పటికీ ఈ వ్యాఖ్యలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఉద్దేశించి చేశారనే వాదన వ్యక్తమవుతున్నది.
మమ్మల్ని వాదన తొక్కేయడానికే
ఒకవేళ ఎవరికైనా మాస్ను ఆకర్షించే రూపం. భాషను అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంటే అవి మా వాదన తొక్కేయ్యడానికే. అయినా మేము మనుషులుగానే ఉండటానికి ప్రయత్నిస్తాం అని పూన్ ట్వీట్లో పేర్కొన్నారు.
టెర్రరిస్టుకైనా అవగాహన
మానవత్వం లేకుండా ఓ వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడో నాకు అర్థం కావడం లేదు. టెర్రరిస్టుకైనా తాను చేసే పనిపైనా పూర్తిగా అవగాహన ఉంటుంది. నాకు కూడా ఏం చేయాలో అనే విషయం తెలుసు. ఓ మనిషిని ఎలాగైనా మార్చే శక్తి రాజకీయాలకు ఉన్నాయి అని పూనమ్ ఘాటుగా స్పందించారు.
ఆ వ్యక్తి నోర్మూసుకొన్నాడు
నిజంగా నేను దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నాను. మీరు ఊహించినట్టు.. అనుకొంటునే వ్యక్తి గురించి కాదు నేను మాట్లాడేది. తనకు తాను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి గురించి కొందరు న్యూస్ ఛానెల్లో గొప్పగా మాట్లాడుతున్నందుకే నేను స్పందిస్తున్నాను. ఆయనకు నిధులు సమకూరుస్తున్న వ్యక్తి ఇప్పుడు నోర్మూసుకొన్నాడు. అందుకే మీ దేవుడ్ని ఎటాక్ చేస్తున్నాను. నేను ఊసరవెల్లిని మాత్రం కాదు అని పూనమ్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.