Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అమ్మాయిలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు.. దేవుడే నిజం చెప్పాలి.. ఎడబాటుకి కారణం.. పూనమ్ కౌర్
సినీతార పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఫ్యాన్స్, సినీ క్రిటిక్ కత్తి మహేష్ వివాదంలో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పెద్ద దుమారమే సృష్టించారు. పూనమ్ ఆ తర్వాత మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ మార్చి 15వ తేదీన పూనమ్ తన ఫేస్బుక్ ఖాతాలో రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఆమె ఏమన్నారంటే..
డైలాగ్స్ కాపీ చేసి..
కొందరు కాన్సెప్ట్, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకొంటున్నారు. మనషులను మారుస్తూ, మాట మీద ఉండకుండా ఉంటున్నారు. అమాయక జనాలతో ఆడుకొంటున్నారు అని తీవ్రంగా స్పందించారు.
జనాలను మభ్యపెడుతున్నారు..
వేష, భాషలను మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
భగవంతుడే నిజం చెప్పాలి
ఇలాంటి విషయాల్లో నిజం ఏంటో భగవంతుడే తెలియజెప్పాలి. అందుకోసం భగవంతుడ్ని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని పూనమ్ ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేశారు.
ఒంటరితనమే బహుమానం
ప్రతీ పనికి ఈ కాలం ఎదో కారణం వెతుకుతుంది. మనిషి జన్మకొక కారణం మనిషి మరణానికి మరో కారణం, మనసుల కలయిక ఒక కారణం ఎడబాటుకి ఇంకో కారణం ఉంటుంది. కానీ ఎప్పుడూ ఒంటరితనమే తనకు బహుమానం అని మరో పోస్టులో పూనమ్ పేర్కొన్నది.
నిందించుకొంటూ కాలం
నిరాశా నిస్పృహలు రాగాలు ఆలపిస్తుంటే మహిళా తన గుండెల్లో పెల్లుబికే దు:ఖాన్ని తన గొంతులోనే సవరించుకుంటన్నది. తనకు తానూ నిందించుకుంటూ ఈ లోకంలో కాలం వెళ్లదీస్తుంది. కానీ ఇప్పుడా రోజులు పోయాయి అని తన పోస్టులో పూనమ్ వెల్లడించింది.
దేవుడు మళ్లీ మళ్లీ పుట్టాలి
అన్యాయం, అక్రమం జరిగినప్పుడు గురుగోవింద్ సింగ్ లాంటి అవతారపురుషులు దానిని చీల్చి చెండాడడానికి సత్యాన్ని కాపాడడానికి ఈ లోకంలో అవతరిస్తారు... మళ్లీ మళ్లీ అవతరిస్తూనే ఉంటారు. ఒక స్ఫురణ, ఒక ఎరుక, ఒక జ్ఞాపకంలో మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అని పూనమ్ కౌర్ వెల్లడించింది.