Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్వీట్ డిలీట్ చేసిన పూనమ్.. నేను ఆమెను లవ్ చేస్తున్నా కత్తి మహేష్ పోస్ట్ వైరల్
దిశ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. దిశా ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసే దాకా ఆగ్రహజ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే సమాజం కోరిన విధంగా చేసినా మళ్లీ నిరసనలు, నినాదాలు మొదలయ్యాయి. మానవ హక్కుల సంఘం అంటూ కొందరు నిద్ర లేచి పోలీసుల తీరును తప్పబడుతున్నారు. ఈ ఎన్కౌంటర్ను నెటిజన్లు, సెలెబ్రిటీలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ట్వీట్ డిలీట్ చేసిన పూనమ్..
పూనమ్ కౌర్ కూడా ఎన్కౌంటర్పై స్పందిస్తూ ట్వీట్ చేసింది. ‘దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి థ్యాంక్స్. ఇలాగే నాలా పలువురు మహిళల్ని మోసం చేసిన కొంతమంది సిని అలియాస్ రాజకీయ నాయకుల్ని కూడా శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు.' అంటూ ఆమె ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ పెట్టిన కాసేపటికే మళ్లీ డిలీట్ కూడా చేసింది.
ఆలోపై వైరల్..
అయితే పూనం తాను చేసిన ట్వీట్ను డిలీట్ చేసిన లోపే.. అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తనతోపాటు పలువురి మహిళలను మోసం చేసిన సినీ అలియాస్ రాజకీయ నాయకులను కూడా శిక్షిస్తారని భావిస్తున్నానని పేర్కొన్న పూనం.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అని చెప్పడంతో అది ఎవరిని ఉద్దేశించి అందో అందరికీ తెలిసిందే.
ఐ లవ్ పూనమ్..
ఈ ట్వీట్ను పోస్ట్ చేస్తూ కత్తి మహేష్ తన ఫేస్బుక్లో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఐ లవ్ పూనమ్ కౌర్ అంటూ ఓ పోస్ట్ చేయడంతో పాటు ఆమె ట్వీట్కు సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. కత్తి మహేష్ చేసిన ఈ పోస్ట్, పూనమ్ చేసిన ట్వీట్ రెండూ వైరల్ అవుతున్నాయి.
బెత్తం దెబ్బలు చాలు..
‘రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు'అని పవన్ కళ్యాణ్ అన్నట్టు మీడియాలో ప్రచురితమైంది. ఈ వార్తను ఆధారంగా చేసుకుని కొంతమంది రాజకీయ నేతలు, పవన్ కళ్యాణ్ను ద్వేషించేవారు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఓ వర్గం పనిగట్టుకుని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. పవన్ కళ్యాణ్ వార్తలపై నాగబాబు వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.