twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరు కాపు కానీ..పోసాని

    By Staff
    |

    Posani Krishna Murali
    చిరంజీవి కాపు అయినా కమ్మ నిర్మాతలకు, డైరక్టర్స్ కే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. క్రాంతి కుమార్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్ అంతా కమ్మవారే కదా దర్శక, నిర్మాత, నటుడు, రచయిత పోసాని చెప్పుకొచ్చారు. చిరంజీవి సామాజిక న్యాయం పాటిస్తున్నరంటూ చిరుకు కులాభిమానం లేదని ఈ విషయాలను ప్రస్ధావనకు తెచ్చారు పోసాని. ఓ ప్రెవేట్ ఛానెల్ తో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ వ్యక్తిగత నిందలతో పుట్టలేదన్నారు. అలాగే ఎవర్ని తొక్కి గెలవాలనే కోరికాలేదన్నారు. తాను ఇంద్రుడ్ని, చంద్రుడ్ని కాదని పార్టీ సేవకుడునని చెప్పుకొచ్చారు. మరి మీ పార్టీ వారు కూడా వ్యక్తిగత ధూషణలు చేస్తున్నారే అంటూ రోజా ప్రస్దావన తేగా..ఒకసారి కొడితే ఊరుకున్నాం..పద్దాక కొడుతుంటే కొట్టించుకుంటామా..మేమూ ఉప్పూ కారం తింటున్నాం...అన్నారు. అలాగే పొలిటిల్ మ్యాటర్స్ లోకి ప్యామిలీ మ్యాటర్స్ లాగకూడదని హితువు పలికారు. రాజకీయాలలోకి రాగానే చిరంజీవి కుటుంబం గురించి కారుకూతలు కూయడం బుద్ధి లేని వాళ్ల పని అంటూ విరుచుకుపడ్డారు.

    'ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక బలహీనత ఉంటుం ది. అలా అని దానిని వేలెత్తి చూప డం ఎంత వరకూ సబబు?' అంటూ ప్రశ్నించారు. చిరంజీవి కూతరు లవ్ మ్యారేజ్, పవన్ రెండో పెళ్ళి అంటున్నారని ఇవి దిగజారిన రాజకీయాలకు ప్రతీక అని విమర్శించారు. ఇక సామాజిక న్యాయం అనేది చిరంజీవే మొదలపెట్టారని మిగతా పార్టీలు ఈ రోజు ఆ పదాన్ని వల్లె వేస్తున్నాయన్నారు. అదే చిరంజీవి గీమాజిక న్యాయం అంటే వారంతా అదే అంటారని అన్నారు. ఇక ఆయన తాజాగా తీస్తున్న రాజుగారి చేపల చెరువు ఎందుకు తీస్తున్నారు..మిగతా పార్టీలను విమర్శించటానికా అంటే..ఫిల్మ్ ఫర్ పబ్లిక్ అని,ఎంటర్టైన్ మెంట్, మెసేజ్ ఉంటాయన్నారు. అలాగే తాను చీప్ విమర్శలుకు పాల్పడనని, ఏ పార్టీనీ తిట్టడానికి, తొక్కడానికి కాదని, అంతగా విమర్శలు చేయాలంటే ఏ టీవి ఛానెల్ కో వెళ్తే చాలునని, మరీ అంతగా కావాలంటే పేపర్లో వెనుకపేజీ యాడ్ ఇచ్చుకుంటానని,రెండున్నర కోట్లు పెట్టి సినిమా తీయాల్సిన పనిలేదని తేల్చి చెప్పేసారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X