twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెంటల్ కృష్ణ తర్వాత చిత్రం పిచ్చోడట..!?

    By Sindhu
    |

    రచయిత నుంచి దర్శకునిగా మారి ఆ తర్వాత నటుడిగా మారిన పోసాని కృష్ణ మురళీ మరో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈసారి పిచ్చివాడిగా నటిస్తున్నాడు. గతంలో భార్యను హింసించే శాడిస్టుగా జీవించిన పోసాని ఈసారి పిచ్చివాడిగా బాగా రాణించారని దర్శకుడు జి. శంకర్ అంటున్నాడు.

    శివశంకర్ ప్రొడక్షన్స్‌పై ఓ మంజుల కథ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అందమైన ఆడపిల్ల శీలాన్ని దోచుకుని ఆ తర్వాత ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు చెప్పారు.

    ఇందులో పోసాని పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగిందనీ అంటూ ఇటువంటి పాత్రను ఆయనే చేయగలరని కితాబిచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నామని నిర్మాత పి.వి. రావు చెప్పారు. తనూరాయ్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X