వాళ్ళు పిచ్చి కుక్కలు..పోసాని

రాజశేఖర్ ఎన్నిసార్లు పరిశ్రమలో వ్యక్తులతో గొడవ పడ్డారో ఏకరవు పెడతాను..ఆధారాలతో సహా అన్నారు. ఇక మా పరిశ్రమలోని వ్యక్తులపై కామెంట్ చేయవద్దని నిబంధన పెట్టింది అంటే..ఆ మురళిమోహన్ కదా పెట్టింది ఆ రూల్..ఆ నిబంధన పెట్టాక ఎంతమంది అలా కామెంట్స్ చేసారో నాకు తెలుసు..ముందు వాళ్ళను శిక్షించమనండి..అన్నారు. ఇక చిరంజీవి పార్టీలో ఎందుకు చేరారు..అంటే ఇండస్ట్రీలో గత ఇరవై ఏళ్ళుగా చిరంజీవిగారు నాకు తెలుసు.
ఎప్పుడూ ఏ నిర్మాతను ఆయన ఇబ్బంది పెట్టలేదు..ఏ ఆర్టిస్టుని సఫర్ చేయలేదు..ఏ దర్శకుడు కంప్లైంట్ ఇవ్వలేదని అందుకే క్లీన్ గా ఉన్న వ్యక్తి గాబట్టే నమ్మానని అన్నారు. ఇక కాంగ్రేస్ గజదొంగ అని తెలుగుదేశం పెద్ద దొంగ అని వీళ్ళిద్దరూ రాష్ట్రాన్ని పంచుకోచూస్తున్నారని విమర్శించారు. ఇక బయటకు వెళ్ళిన పరకాల ప్రభాకర్ పై కామెంట్ చేస్తూ..పరకాల గడ్డి తినే పశువు కన్నా హీనమని..నిన్నటి దాకా చిరంజీవిని దేముడు అని పొగిడిన ఆయన ఇలా మాట్లాడటం సంస్కారం కాదన్నారు. అంతేగాక పరకాల మంచి కుటుంబం నుంచి వచ్చారని ఆ చరిత్రనైనా నిలబెట్టుకోవాలి అన్నారు.


Click it and Unblock the Notifications











