Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కిన్నెరకి భరోసా..! పోసాని మరోసారి తానేమిటో చూపించాడు
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆయన రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు పోసాని .
తెలుగు సినీ పరిశ్రమలో పోసాని కృష్ణమురళిది ఓ విభిన్నమైన మనస్థత్వం. ఏ విషయంపైనైనా లోపల ఒకటి పెట్టుకుని, బయటకు మరొకటి మాట్లాడటం ఆయనకు చేతకాదు. దూకుడైన స్వభావంతో.. ముక్కుసూటిగా మాట్లాడే నటుడు పోసాని కృష్ణమురళి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలైనా.. సమకాలీన రాజకీయాలైనా.. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు పోసాని.
కుండబద్ధలు కొట్టినట్టే తన మనసులోని మాటను ఆయన వెల్లడిస్తారు. ఆయనలోని మరో కోణం ఏమిటంటే, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సాయం చేయడం. కష్టాల్లో ఉన్న వారు ఎదురైతే ఆయన చలించిపోతారు. తాజాగా, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్యకు ఆయన రూ. 25 వేల ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు, భవిష్యత్తులో తిండికి, బట్టకు ఏ లోటు వచ్చినా.. ఆదుకునేందుకు తానెప్పుడూ సిద్దంగానే ఉంటానని భరోసా ఇచ్చారు.
గతంలో 52దేశాల ప్రతినిధులను తన కిన్నెర వాయిద్యంతో ఉర్రూతలుగించారు మొగులయ్య. ఈరోజుల్లో 12మెట్ల కిన్నెర వాయిద్యంతో గానం చేస్తున్న ఒకే ఒక వ్యక్తి మొగులయ్య కావడం విశేషం. ఆయన తర్వాత ఆ కళ సజీవంగా బతికి ఉండాలంటే.. ప్రభుత్వం చొరవ చూపి కిన్నెర మెట్ల కళను బావితరాలకు అందించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.