Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
వివాహం విద్య నాశనం... శోభనం సర్వనాశనం: తన పెళ్లి గురించి పోసాని కామెంట్!
Recommended Video
ప్రముఖ తెలుగు నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఏం మాట్లాడినా సంచలనమే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని పెళ్లి కారణంగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి వెల్లడించారు. పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లి కారణంగా భార్యభర్తలుగా తాము ఏం కోల్పోయామో వెల్లడించే ప్రయత్నం చేశారు.
'నా భార్య పేరు కుసుమలత, తను బిఎస్సీ బిఎల్... ఎంఎల్ నాగ్ పూర్ యూనివర్శిటీ. తను ఎంఎల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగా మా పెళ్లి అయింది. నేను ఎంఏ, ఎంఫిల్ చేశాను. పిహెచ్డి 3 సంవత్సరాలైంది. మూడు నెలల్లో వైవా చేస్తే డాక్టరేట్ వచ్చేది. ఆ సమయంలోనే మా పెద్దలు పెళ్లి కుదిర్చారని తెలిపారు.
వివాహం విద్య నాశనం.. శోభనం సర్వనాశనం
‘‘రెండు మూడు నెలలు ఆగితే నా పిహెచ్డి అయిపోయి నేను డాక్టరేట్ పొందేవాడిని, మా ఆవిడ ఎంఎల్ కూడా పూర్తయ్యేది. కానీ పెద్దలు అప్పుడే పెళ్లి చేశారు. వారి మాట కాదనలేక పోయాం. పెళ్లయితే అంతే... వివాహం విద్య నాశనం.. శోభనం సర్వనాశనం.'' అని వ్యాఖ్యానించారు.
మా మధ్య అనుబంధం
కానీ దానికి మించిన సాన్నిహిత్యం, ఆప్యాయతలు, ఎఫెక్షన్, లవ్ అవన్నీ.. నాకు, నా భార్య మధ్య కాస్త ఎక్కువగా ఏర్పడ్డాయి. మేమిద్దరం మొగుడు పెళ్లాల మాదిరిగా ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు. ముందు నుంచీ ఫ్రెండ్స్ లాగే ట్రావెల్ అవుతూ వచ్చామని పోసాని గుర్తు చేసుకున్నారు.
ఒక్కోసారి నేను కొడుకు, ఆమె తల్లి
పెళ్లయినప్పటి నుంచి ఆమె నా పెళ్లాం.. నేను మొగుడు అనుకోలేదు. ఓసారి నేను పెళ్లాం పాత్ర... ఓసారి ఆమె మొగుడు పాత్ర... మరోసాని ఫ్రెండు పాత్రల్లో ఉంటాం. కొన్ని సార్లు నేను కొడుకు పాత్రలో.. నా భార్య అమ్మపాత్రలో ఉంటుంది... అంటూ తమ మధ్య అనుబంధం గురించి పోసాని వివరించారు.
ఇంటి పెత్తనం అంతా ఆవిడదే
‘‘ఇంట్లో
ఎవరి
డామినేషన్
ఎవరి
మీద
ఉండదు.
ఇంటి
పెత్తనం
అంతా
కూడా
నా
భార్యదే.
డబ్బులకు
సంబంధించిన
విషయాలైనా,
మరే
ఇతర
విషయమైనా
నేను
ఆమెకు
తెలియజేస్తాను.''
అని
పోసాని
కృష్ణ
ముకళి
వెల్లడించారు.
కుమారుడి గురించి అంతకు ముందు ఓ వేడుకలో
కొన్ని రోజుల క్రితం జరిగిన ‘ముఖ్యమంత్రిగారు మీరు మాటిచ్చారు' అనే సినిమా వేడుకలో పోసాని తన కుమారుడి గురించి మాట్లాడుతూ... 'ఈ చిత్రానికి కథ, మాటలు నేను రాయలేదు. నా కొడుకు రాశాడు. వాడి పేరు పోసాని ఉజ్వల్. నాకంటే ఫాస్ట్. తెలివిగలవాడు. ఇపుడు హంగేరీలో ఉంటూ మీడియా సైన్స్ అనే కోర్స్ చేస్తున్నాడు. నన్ను నా కొడుకు ఒరేయ్ అంటాడు... కథ, మాటలు రాసి ఒరేయ్ ఇది తీయ్ చాలా బావుంటుంది, కొత్తగా ఉంటుంది అని చెప్పాడు' అని గుర్తు చేసుకున్నారు.