పోసాని చేపల చెరువు

ఇక మెంటల్ కృష్ణ' విడుదలై యాభై రోజులైన సందర్భంగా పోసాని మాట్లాడుతూ "పరిమిత పెట్టుబడితో తెరకెక్కిన మెంటల్ కృష్ణ విజయవంతంగా ప్రదర్శితమైంది. 30 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవాన్ని పూర్తి చేసుకొంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధం గురించి చర్చించిన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభించింది. సినిమాకు ఆ పేరు బాగా కలిసొచ్చింది. నటుడిగా కూడా గుర్తింపు దక్కింది. ఆ పాత్రకు పోసాని చక్కగా సరిపోయాడని ప్రేక్షకులు అన్నారు. ఇంతకంటే ప్రశంస ఏం కావాలి. సంభాషణలు, కథాంశం అందరికీ నచ్చాయి కాబట్టే విజయం దక్కింది" అన్నారు.
అలాగే పోసాని ప్రజారాజ్యం పార్టీలో చేరారు కదా. రాజావారి చేపల చెరువు ఆ పార్టీ విధానాలకు సంబంధించిన చిత్రమా అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "అటువంటిదేమీ కాదు. ప్రత్యేకంగా ఏ ఒక్క పార్టీని విమర్శిస్తూనో, సమర్థిస్తూనో ఉండదు" అన్నారు. అయితే ఈ చిత్రం ఈ మద్య ఏర్పడిన మహా కూటమిని ఉద్దేశిస్తూ సెటైర్స్ తో తీసిన చిత్రమని కొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











