Don't Miss!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- News పిఠాపురంకు చిరంజీవి, మెగా హీరోలు - ముహూర్తం ఫిక్స్..!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆర్మీ మేజర్ గా పోసాని 'నిశ్శద్ద యుద్దం'
ఆర్మీ మేజర్గా పోసాని కృష్ణమురళి, సూర్యారావు, సునాక్షి జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో లైఫ్ కేర్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న 'నిశ్శబ్ద యుద్ధం' చిత్రం షూటింగ్ హైదరాబాద్లో శరవేగంతో జరుగుతోంది. ఈ నెల 22తో రెండు పాటలు, క్లైమాక్స్ మినహా చిత్రం పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. వైవిధ్యమైన ప్రేమకథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ముఖ్య భూమిక పోషిస్తున్న డా.శివప్రసాద్ మాట్లాడుతూ' పరిశ్రమకి ఈ రోజు అవసరమైన పద్ధతుల్లో ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ తీస్తున్నారు.
నిర్మాతలు నిర్మాణపరంగా ఎక్కడా రాజీపడటంలేదు' అన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు హీరో హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ బేనరుపై దర్శకుడు తోట కృష్ణ దర్శకత్వంలో వరుసగా సినిమాలు నిర్మిస్తామని నిర్మాణ సారథి శ్రీనివాస్ చెప్పారు. శివాజీరాజా, హేమ, డా. శివప్రసాద్, మాగం వాసు, నర్సింగ్ యాదవ్, సూర్య, సారిక రామచంద్రరావు, కళ్లు చిదంబరం, శ్రీకళ, శ్రీమణి, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: జయకుమార్, పైట్స్: థ్రిల్లర్ మంజు.