పోసాని చేపల చెరువు ఏమైంది?

By Staff

Posani Krishna Murali
పోసాని కృష్ణ మురళి రాజకీయ వ్యంగ్య చిత్రంగా రూపొందించుతున్న రాజుగారి చేపల చెరవు ఆగిపోయినట్లేనని అంతటా వినపడుతోంది. ఏదో మిరాకిల్ జరిగితే తప్ప ఎన్నికల ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్నారు. అందులోనూ ఎన్నికల్ కోడ్ ని అనుసరించి కూడా రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తున్న వారు తయారు చేసే పొలిటికల్ సినిమాలు, ప్రకటనలు రిలీజవటం కష్టమేనని తెలుస్తోంది. ఇక ఎలక్షన్ ముందు రిలీజ్ కాకపోతే పోసాని చేపల చెరువు మురిగిపోయి..చేపలు చచ్చిపోతాయంటున్నారు. కానీ పోసాని మాత్రం ఎంతో ప్రయాసలకు ఓర్చి చాలా త్వరగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

అయితే ఆయనకి చిలకలలూరి పేట నుంచి పీఆర్పీ టిక్కెట్ ఇవ్వటంతో ఈ సినిమాకు సమస్య వచ్చింది. పోసాని ఆ ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు. అలా కాకుండా ఈ సినిమా డబ్బింగ్, రిలీజ్ అంటూ వెళితే చివరకు ప్రచారానికి నష్టం వస్తుంది. ఇదిలా ఉంటే..నిర్మాతల తరఫు నుంచి ఆలోచిస్తే లక్ష్మీ గణపతి సినిమా వారికి ఇది తొలి తెలుగు సినిమా. వారికి ఇది పెద్ద దెబ్బేనంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక సినిమా విడుదలైనా కూడా అంత పెద్ద క్రేజ్ ఉండదని నిర్మాత సుబ్రమణ్యం చాలా మందితో చెప్పి బాధపడుతున్నాడని వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X