Don't Miss!
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష కోట్ల అవినీతిపై డైలాగ్, జగన్ను అనలేదన్న పోసాని!
జగన్కు తాను మద్దతిస్తున్న మాట వాస్తవమే... కేవలం ఆరోపణల నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నారు, ఒక వేళ ఆయనపై కోర్టులో అవినీతి ఆరోపణలు రుజువైతే మద్దతు ఉప సంహించుకోవడంతో పాటు, ఆయన అవినీతి గురించి విమర్శిస్తానని స్పష్టం చేసారు. దేశంలో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటే అది ముమ్మాటికీ ప్రజల తప్పే. అవినీతి పరుల్ని గట్టిగా నిలదీయక పోవడం వల్లనే వ్యవస్థ ఇలా తగలబడిందని వ్యాఖ్యానించారు.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ వారి మనో భావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వారు పోరాటాలు చేసి వాటిని తొలగించేలా చేసారు. దేనికైనా రెడీ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయి కాబట్టే ఆందోళన కార్యక్రమాలు చేసారు. వాళ్లు శాంతి కాముకులు కాబట్టే పిండం పెట్టి ఊరుకున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఎవరి మనో భావాలు దెబ్బ తీయలేదు. అందులో నేను చెప్పిన డైలాగులు కానీ, క్రిష్ దర్శకత్వం గానీ జగన్ను ఉద్దేశించి కాదని పోసాని తేల్చి చెప్పారు.