Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లక్ష కోట్ల అవినీతిపై డైలాగ్, జగన్ను అనలేదన్న పోసాని!
జగన్కు తాను మద్దతిస్తున్న మాట వాస్తవమే... కేవలం ఆరోపణల నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నారు, ఒక వేళ ఆయనపై కోర్టులో అవినీతి ఆరోపణలు రుజువైతే మద్దతు ఉప సంహించుకోవడంతో పాటు, ఆయన అవినీతి గురించి విమర్శిస్తానని స్పష్టం చేసారు. దేశంలో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటే అది ముమ్మాటికీ ప్రజల తప్పే. అవినీతి పరుల్ని గట్టిగా నిలదీయక పోవడం వల్లనే వ్యవస్థ ఇలా తగలబడిందని వ్యాఖ్యానించారు.
'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో తెలంగాణ వారి మనో భావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వారు పోరాటాలు చేసి వాటిని తొలగించేలా చేసారు. దేనికైనా రెడీ చిత్రంలో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయి కాబట్టే ఆందోళన కార్యక్రమాలు చేసారు. వాళ్లు శాంతి కాముకులు కాబట్టే పిండం పెట్టి ఊరుకున్నారు. కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో ఎవరి మనో భావాలు దెబ్బ తీయలేదు. అందులో నేను చెప్పిన డైలాగులు కానీ, క్రిష్ దర్శకత్వం గానీ జగన్ను ఉద్దేశించి కాదని పోసాని తేల్చి చెప్పారు.