Don't Miss!
- News హరిరామ జోగయ్య యూటర్న్-పవన్ తో పాటు కూటమికీ భారీ ఊరట..!
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
‘గబ్బర్ సింగ్’ చిత్రానికి అదే పెద్ద ప్లస్...
సమ్మర్ బరిలో చివరకు టాప్ పొజిషన్లో నిలిచేది ఎవరు? ఇప్పటికే 'రచ్చ' చిత్రం విడులై మాస్ హిట్గా మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'దమ్ము' చిత్రం కూడా భారీ అంచనాలతో విడుదలకు సిద్దం అవుతోంది. మరో వైపు మే 2వ వారంలో 'గబ్బర్ సింగ్' బరిలోకి దూకుతున్నాడు. ఈ సమ్మర్లో చెప్పుకోదగ్గ టాప్ 3 సినిమాలు ఇవే. వీరి మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంటుంది. వీటిలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుంది? ఏ సినిమాను ప్రేక్షకులు ఎక్కువ ఆదరిస్తారు? అనే అంశాలు చర్చనీయాంశం అయింది.
రచ్చ చిత్రం విషయానికొస్తే కేవలం మాస్ ఎంటర్ టైనర్ మాత్రమే. అభిమానులకు మాత్రమే సంతృప్తినిచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మెప్పించలేక పోయింది. 'దమ్ము' చిత్రంపై ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ చిత్రం మాస్ అండ్ ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో కామెడీ పాళ్ల చాలా తక్కువేనని స్పష్టం అవుతోంది.
అయితే గబ్బర్ సింగ్ చిత్రం మాత్రం ఇటు మాస్ అంశాలతో పాటు...పవన్ కళ్యాణ్ మార్క్ సెటైరిక్ కామెడీ మసాలాతో రూపొందించారు. కామెడీ ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఇష్ట పడతారు. ఇవన్నీ సినిమా ప్లస్సయ్యే అంశాలు. దీనికి తోడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా సినిమాపై అంచనాలు పెంచింది. దూకుడు రేంజ్లో సినిమా ఉండొచ్చని అంటున్నారు.
అలా అని 'దమ్ము' చిత్రాన్ని తక్కవ అంచనా వేయలేం. ఎన్టీఆర్ పవర్ ఫుల్ యాక్షన్తో సింగిల్గా సినిమాను నెట్టుకురాగలడు. అయితే ప్రేక్షకుడి మనసు ఏ సినిమా విషయంలో ఎలా ఉంటుందో విడుదలయ్యే వరకు చెప్పడం కష్టమే. మరి ఈ నేపథ్యంలో సమ్మర్ కింగ్ ఎవరో ఇప్పుడే నిర్ణయించడం అసాధ్యం.