ప్రభాస్ పౌర్ణమి ఏప్రిల్ 20న విడుదల
సూపర్హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన భారీ నిర్మాత ఎంఎస్ రాజు ఏప్రిల్ 20న పౌర్ణమి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై విజయవంతమైంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నలుగురు హీరోయిన్లు నటించడం విశేషం. ఆ నలుగురు త్రిష, చార్మి, సింధు తులానీ, మధుశర్మ. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని విశేషాలను దట్స్ తెలుగు సేకరించింది. చంద్రముఖి లాగానే ఈ సినిమాలో పునర్జన్మ ఉంటుంది. చార్మి మరణించడంతో ఆమె ఆత్మ త్రిషను ఆవహిస్తుంది. అప్పటి వరకు సంగీతమంటే ఇష్టం ఉండని త్రిష చార్మి ఆత్మ ఆవహించడంతో సంగీతం, నృత్యమే ప్రాణంగా జీవిస్తుంది. ప్రభాస్ కొన్ని సన్నివేశాల్లో దేవానంద్ మేకప్లో కనిపిస్తాడు.


Click it and Unblock the Notifications