ప్రభాస్ 20 అప్డేట్: ముగించిన ప్రభాస్.. షూటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే!
సాహో తర్వాత ప్రభాస్ కెరీర్లో 20వ సినిమాగా రాబోతున్న కొత్త సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. హై రేంజ్ బడ్జెట్తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతోందని తెలియడంతో సినిమా పట్ల మరింత ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా మూడో షెడ్యూల్ షూటింగ్ కూడా పుర్తిచేసుకుందట.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో ప్రభాస్, పూజా హెగ్డేపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ ఒక్క సెట్ కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతోందట చిత్రయూనిట్. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి మూడో షెడ్యూల్స్ పూర్తయ్యాయి. నాలుగో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభాస్ ఓ వారం రోజులపాటు రెస్ట్ తీసుకోనున్నాడని తెలుస్తోంది.

గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం.
ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారు. చిత్రంలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











