Don't Miss!
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు, ఆయనతో విభేదాల్లేవు, వెళ్లగానే మహానటి చూస్తా: దుబాయ్ మీడియాతో ప్రభాస్
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని రోజులుగా దుబాయ్లో 'సాహో' షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత 50 రోజులుగా దాదాపు 250 మంది చిత్ర బృందం సినిమాకు పని చేశారు. దాదాపు 3 వారాల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ చిత్రీకరించారు. టైగర్ జిందాహై తర్వాత ఎక్కువ రోజులు దుబాయ్లో షూటింగ్ జరుపుకున్న భారతీయ సినిమా ఇదే. షూటింగ్ ముగిసిన అనంతరం ప్రభాస్ దుబాయ్ మీడియాతో మాట్లాడారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర అంశాలను పంచుకున్నారు. అబు దుబాయ్ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు.
నా జీవితంలో ఇంత రిస్క్ ఎప్పుడూ చేయలేదు
నా సినీ కెరీర్లో చేసిన అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ మూవీ ఇది. ఈ సినిమాకు చేసినంత రిస్కీ సీన్లు ఎప్పుడూ చేయలేదు. ఇందులో బైక్ రేసింగ్ సీన్లలో నా జీవితంలో ఎప్పుడూ నడపనంత వేగంగా బైక్ నడిపాను అని ప్రభాస్ వెల్లడించారు.
దుబాయ్ ప్రభుత్వ సహకారం మరువలేనిది
రంజాన్ సీజన్ కావడంతో షూటింగుకు అడ్డంకులు ఏర్పడతాయని భావించాం. కానీ దుబాయ్ ప్రభుత్వం మాకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాలుగా సహకారం అందించారు, మా కోసం అబు దుబాయ్ టీమ్ ట్రాఫిక్ కూడా నిలిపివేశారు అని ప్రభాస్ వెల్లడించారు. ఇక్కడ ప్రభుత్వం సినిమా షూటింగులకు అయ్యే ఖర్చులో 30 శాతం రిబేట్ ఇస్తుంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి అని ప్రభాస్ తెలిపారు.
ఈ సినిమా కోసం బరువు తగ్గాను
గతంలో బాహుబలి కోసం దాదాపు 10 కేజీల బరువు పెరిగాను. అయితే అన్ని సినిమాలకు అలాంటి ఫిజిక్ అవసరం ఉండదు. అందుకే సాహో కోసం బరువు తగ్గాను. స్పెషల్ డైట్ ఫాలో అవ్వాల్సి వచ్చింది అని ప్రభాస్ వెల్లడించారు.
కరణ్ జోహార్తో విబేధాలు లేవు
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ప్రభాస్ మధ్య విబేధాలు ఉన్నాయని, కరణ్ జోహార్ ఆఫర్ చేసిన రెండు సినిమాలను ప్రభాస్ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభాస్ స్పందించారు. అందులో నిజం లేదన్నారు. ఈ రూమర్స్ గురించి కరణ్ జోహార్ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. మా ఇద్దరి మధ్య మంచి రాపో ఉంది అని యంగ్ రెబల్ స్టార్ తెలిపారు.
ఇంటికి వెళ్లగానే మహానటి చూస్తాను
ఇండియా వెళ్లగానే ‘మహానటి' సినిమా చూస్తాను, నాకు ఎంతో నచ్చిన నటి సావిత్రి అని ప్రభాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుల్లో రాజ్ కుమార్ హిరానీ చిత్రాలు అంటే ఇష్టమన్నారు. ప్రస్తుతం ఆయన తీస్తున్న సంజు మూవీ ట్రైలర్ ఎంతో నచ్చిందని తెలిపారు.
రాజమౌళి పాకిస్థాన్ పర్యటనపై
పాకిస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలిని ప్రదర్శించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి పాక్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ అక్కడ మా సినిమాకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది. పాక్ ప్రజలను రాజమౌళిని వెల్ కం చేసిన తీరు నచ్చింది. సినిమాలకు మాత్రమే ప్రజలను దగ్గర చేసే పవర్ ఉంది అని రాజమౌళి వెల్లడించినట్లు ప్రభాస్ తెలిపారు.