Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ 'ఆది పురుష్'లో రావణుడిగా బాలీవుడ్ స్టార్.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్
ఇండియన్ బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ప్రభాస్ ఆది పురుష్ పై అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం అంతకు మించిన రేంజ్ లో అడుగులు వేస్తున్న రెబల్ స్టార్ కెరీర్ కి మరింత బూస్ట్ ఇచ్చేలా సినిమాలు రాబోతున్నట్లు అభిమానులకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఆది పురుష్ సినిమాలో అత్యంత కీలకమైన మెయిన్ విలన్ పాత్రపై కూడా చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది
Recommended Video
ఏడు వేల సంవత్సరాల క్రితం
సరిగ్గా ఏడు వేల సంవత్సరాల క్రితం ఒక తెలివైన రాక్షసుడు ఉండేవాడు అంటూ దర్శకుడు ఓం రావత్ నిన్న సినిమము సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చాడు. 7 గంటల 11నిమిషాలకు ఆ పాత్ర యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇవ్వనున్నట్లు చెప్పడంతో అభిమానుల్లో ఒక తెలియని సంబరాలు మొదలయ్యాయి. ఇక ఆ అప్డేట్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్
ఈ సినిమా రామాయణ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదట చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోయినప్పటికి ఆ పోస్టర్ చూడగానే అర్థమైంది. పైగా చాలా మంది సినీ ప్రముఖులు ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక రావణుడి పాత్రపై క్లారిటీ ఇచ్చేశారు. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నట్లు వివరణ ఇచ్చారు.
అనుకున్నదే నిజమైంది
మొదటి నుంచి కూడా రావణ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నట్లు బాలీవుడ్ లో అనేక రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఇక మొత్తానికి అనుకున్నదే నిజమైంది. ఏడు వేల సంవత్సరాల క్రితం తెలివైన రాక్షసుడు ఉన్నాడంటూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేయడం వైరల్ గా మారింది.
ప్రభాస్ కి ప్రతినాయకుడు అంటే..
ఇక ఈ సినిమా పూర్తిగా 3Dలో రూపొందుతోంది. ఇప్పటికే ఫ్యాన్ మెడ్ పోస్టర్స్ తో సినిమాకు భారీ స్థాయిలో బజ్ పెరిగింది. ఇక ప్రభాస్ కి ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ స్టార్ నటిస్తున్నాడు అంటే అంచనాలు ఏ స్థాయిలో పేరిగిపోతాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా సినిమాగా బిగెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న అది పురుష్ సినిమాను T సిరీస్ బ్యానర్ లో భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.