Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వాళ్ల జీవితాలను రిస్క్లో పెట్టలేను.. రాధేశ్యామ్ విషయంలో ప్రభాస్ డేరింగ్ నిర్ణయం!
దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలను అతలాకుతలం చేస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్.. సినిమా పరిశ్రమను కూడా భారీ దెబ్బ తీస్తున్నది. సినిమా పరిశ్రమకు ముఖ్య పట్టణాలైన ముంబై, హైదరాబాద్, చెన్నైలో కోవిడ్ పరిస్థితులు భయంకరంగా ఉండటంతో సినిమా షూటింగులు వాయిదాలు పడుతన్నాయి. తాజాగా రాధేశ్యామ్ సినిమాను కూడా వాయిదా వేసినట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...
హాట్ హాట్గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)
లాక్డౌన్ తర్వాత ప్యాన్ ఇండియా మూవీస్తో
లాక్డౌన్ తర్వాత ప్రభాస్ మంచి జోష్ మీద కనిపించాడు. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో రాధేశ్యామ్ షూటింగు దశలో ఉండగానే.. ఓం రావత్తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్తో సలార్ చిత్రాలను ప్రారంభించారు. నాగ్ అశ్విన్ సినిమాను ఆ తర్వాత సిద్దం చేశారు.
ఆదిపురుష్ మూవీ షూటింగ్
ముంబైలో కరోనావైరస్ పరిస్థితులు అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ను కొద్ది రోజులు వాయిదా వేశారు. దాదాపు 30 శాతం షూటింగును 30 రోజుల్లో పూర్తి చేశాం అని డైరెక్టర్ ఓం రావత్ స్పష్టం చేశారు. ఇలాంటి వార్త నేపథ్యంలో అభిమానులు షాక్ నుంచి తేరుకోక ముందే ప్రభాస్ మరో షాక్ ఇచ్చారు.
రాధేశ్యామ్ షూటింగ్ క్యాన్సిల్
ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా రాధేశ్యామ్ సినిమా షూటింగును వాయిదా వేయాలని ప్రభాస్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. సాంకేతిక నిపుణులు, నటీనటులు జీవితాలను రిస్క్లో పెట్టలేం. కావున రాధేశ్యామ్ సినిమా షూట్ను కొద్ది రోజులు వాయిదా వేయాలని నిర్మాతలకు ప్రభాస్ సూచించినట్టు సమాచారం. దాంతో రాధేశ్యామ్ను కొద్ది రోజులపాటు నిలిపివేసినట్టు తెలుస్తున్నది.
ఇంకా 10 రోజుల షూటింగ్
రాధేశ్యామ్ షూటింగును లాక్డౌన్కు ముందు ఇటలీ, ఇతర దేశాల్లో చేశారు. అయితే విదేశాల్లో షూటింగుకు అనుమతులు లేకపోవడం వల్ల హైదరాబాద్లోనే సెట్స్ వేసి షూటింగ్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఇంకా 10 రోజుల షూటింగ్ మిగిలి ఉన్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమా రిలీజ్ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు.
టాప్ హీరోల సినిమాలు వాయిదా
కరోనా కారణంగా టాలీవుడ్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి. ఇప్పటికే భారీ బడ్జెట్ చిత్రాలు, టాప్ హీరోల సినిమాల షూటింగులు, రిలీజ్లు వాయిదా పడ్డాయి. RRR, సర్కారు వారీ పాట, ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాల షూట్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక చిన్న చిత్రాల పరిస్థితి మాటల్లో చెప్పలేకుండా ఉంది అనే విషయాన్ని సినీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.