Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'మిర్చి' లో ప్రభాస్ పాత్ర ఏమిటి?
హైదరాబాద్ : ''ఎంతటి వారితోనైనా హాహాకారాలు పెట్టించే సత్తా 'మిర్చి'ది. పరిధి దాటి ప్రవర్తిస్తే... మిర్చి దెబ్బను మర్చిపోవడం కష్టం. ఈ ఘాటైన లక్షణాలే ఓ మనిషిలో ఉంటే? ఈ ప్రశ్నకు సమాధానమే 'మిర్చి'లో ప్రభాస్ పాత్ర'' అంటున్నారు దర్శకుడు కొరటాల శివ. రచయితనుంచి దర్శకుడుగా మారుతున్న కొరటాల శివ చిత్రం 'మిర్చి'. ఈ చిత్రం విడుదల గురించి మీడియాతో దర్శకుడు మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే.. ''నవరసాలు మేళవించిన కథ ఇది. ప్రభాస్ హావభావాలు అందరికీ నచ్చుతాయ''న్నారు దర్శకుడు.
నిర్మాతలు మాట్లాడుతూ... ''మిర్చి కొరికితే ఎంత ఘాటుగా ఉంటుందో... అలాగే ఉంటుంది కథానాయకుడి పాత్ర. నేటి తరం కుర్రాళ్లలో ఉండే దూకుడుతోపాటు వెన్నలాంటి మనసు కూడా అతని సొంతం. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ వినసొంపైన బాణీలు ఇచ్చారు'' అన్నారు.
కటౌట్ని చూసి కొన్ని నమ్మేయాల్సిందే డ్యూడ్... అంటున్నారు ప్రభాస్. 'మిర్చి' సినిమాలో తాను ఎలా కనిపించబోతున్నదీ ప్రచార చిత్రాల్లో చెప్పకనే చెప్పారు. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ . వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ నిర్మాతలు. కొరటాల శివ దర్శకుడు. వచ్చే నెల మొదటి వారంలో పాటల్ని విడుదల చేస్తారు.
ప్రభాస్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న చిత్రం 'మిర్చి'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను జనవరి మొదటి వారంలో విడుదల చేసి, ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే రోజైన పిబ్రవరి 14 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, సంపత్కుమార్, ఆదిత్య మీనన్ ఇతర పాత్రధారులు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్కుమార్, ఛాయాగ్రహణం: మది.