Don't Miss!
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అర్జున్రెడ్డి కంటే నీవే ఇరుగదీశావు.. షాహీద్కు ప్రభాస్ ఫోన్.. కబీర్సింగ్కు ప్రశంస
తెలుగులో ఘన విజయం సాధించిన అర్జున్ రెడ్డి హిందీలో రీమేకై విడుదలకు సిద్ధమవుతున్నది. షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్యమైన రెస్పాన్స్ను సంపాదించుకొన్నది. ఈ క్రమంలో టీజర్ చూసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అందులో హీరో షాహీద్ కపూర్ ఫెర్ఫార్మెన్స్ను చూసి షాకయ్యారట. ఈ విషయాన్ని ప్రభాస్, షాహీద్ కామన్ హెయిర్ స్టయిలిస్ట్ ఒకరు వివరించారు. ఆయన తెలిపిందేమింటంటే...
సాహో మూవీ షూటింగ్లో ఉండగా
ప్రభాస్, షాహీద్ హెయిర్ స్టయిలిష్ట్ ఆలీమ్ హకీం మాట్లాడుతూ.. సాహో షూటింగ్లో ఉండగా షాహీద్ కపూర్ కబీర్ సింగ్ టీజర్ రిలీజైంది. ఆ టీజర్ను చూసి బాగా ఇష్టపడ్డాడు. టీజర్లో షాహీద్ నటన చాలా బాగుంది. బ్రిల్లియంట్ అని ప్రభాస్ చెప్పడంతో అప్పుడే నేను షాహీద్కు ఫోన్ కలిపాను.
ఏడు నిమిషాలు ఫోన్లో సంభాషణ
కబీర్ సింగ్ టీజర్ గురించి ప్రభాస్, షాహీద్ కపూర్ ఫోన్లో ఏడు నిమిషాలకుపైగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఒరిజినల్ అర్జున్ రెడ్డి కంటే హిందీ కబీర్ సింగ్ టీజర్ బాగా నచ్చింది అని ప్రభాస్ ప్రశంసించారు. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే.
కబీర్ సింగ్కు అనూహ్య స్పందన
ఇటీవల విడుదలైన కబీర్ సింగ్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి అనూహ్యమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ ముంబైలో పెద్ద ఎత్తున పార్టీ చేసుకొన్నారు. ఈ పార్టీలో సందీప్ రెడ్డి వంగా, షాహీద్ కపూర్, కియారా అద్వానీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం జూన్ 21న విడుదల కాబోతున్నది.
ఆగస్టు 15న సాహో మూవీ
ఇక ప్రభాస్ విషయానికి వస్తే, బాహుబలి తర్వాత అంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాహోలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.