Don't Miss!
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- News Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
'ఏక్ నిరంజన్' పాయింట్ అదే?
ప్రభాస్, కంగనా రౌనత్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఏక్ నిరంజన్'చిత్రం కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. హీరో కొన్ని అవసరాల కోసం హీరోయిన్ ని కిడ్నాప్ చేయటం, అక్కడ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, ప్రేమలతో ఈ చిత్రం నిండి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో నయితే సంజయ్ దత్ నటించిన 'కిడ్నాప్' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇందులో చోటుచేసుకున్నాయని గుసగుసలాడుతున్నారు. మరో ప్రక్క బుజ్జిగాడు మేడిన్ చెన్నై వర్కవుట్ కాకపోవటంతో ఈ చిత్రంలో ఎలాగైనా ప్రభాస్ కి హిట్టు ఇవ్వాలని పూరీ పట్టుదలతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ సైతం తమ సొంత చిత్రం భిల్లా ఎంత హంగు ఆర్బాటాలతో తీసినా ఊహించిన విజయం సాధించకపోవటంతో ఏక్ నిరంజన్ పైనే కాన్సర్ టేట్ చేసినట్లు చెప్తున్నారు. ఇవన్ని ఇలా ఉంటే బాలీవుడ్ కిడ్నాప్ బాల్చీ తన్నేసింది కాబట్టి ఆ పాయింట్ ఎత్తుకున్నా పూరీ తన దైన శైలిలో మార్చి మశాలా వేస్తేనే ఎక్కుతుందనేది నిజం.