Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ఏక్ నిరంజన్' పాయింట్ అదే?
ప్రభాస్, కంగనా రౌనత్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఏక్ నిరంజన్'చిత్రం కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. హీరో కొన్ని అవసరాల కోసం హీరోయిన్ ని కిడ్నాప్ చేయటం, అక్కడ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, ప్రేమలతో ఈ చిత్రం నిండి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో నయితే సంజయ్ దత్ నటించిన 'కిడ్నాప్' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇందులో చోటుచేసుకున్నాయని గుసగుసలాడుతున్నారు. మరో ప్రక్క బుజ్జిగాడు మేడిన్ చెన్నై వర్కవుట్ కాకపోవటంతో ఈ చిత్రంలో ఎలాగైనా ప్రభాస్ కి హిట్టు ఇవ్వాలని పూరీ పట్టుదలతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ సైతం తమ సొంత చిత్రం భిల్లా ఎంత హంగు ఆర్బాటాలతో తీసినా ఊహించిన విజయం సాధించకపోవటంతో ఏక్ నిరంజన్ పైనే కాన్సర్ టేట్ చేసినట్లు చెప్తున్నారు. ఇవన్ని ఇలా ఉంటే బాలీవుడ్ కిడ్నాప్ బాల్చీ తన్నేసింది కాబట్టి ఆ పాయింట్ ఎత్తుకున్నా పూరీ తన దైన శైలిలో మార్చి మశాలా వేస్తేనే ఎక్కుతుందనేది నిజం.