Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఏక్ నిరంజన్' పాయింట్ అదే?
ప్రభాస్, కంగనా రౌనత్ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాధ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఏక్ నిరంజన్'చిత్రం కిడ్నాప్ చుట్టూ తిరిగే కథ అని సమాచారం. హీరో కొన్ని అవసరాల కోసం హీరోయిన్ ని కిడ్నాప్ చేయటం, అక్కడ నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు, ప్రేమలతో ఈ చిత్రం నిండి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో నయితే సంజయ్ దత్ నటించిన 'కిడ్నాప్' చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఇందులో చోటుచేసుకున్నాయని గుసగుసలాడుతున్నారు. మరో ప్రక్క బుజ్జిగాడు మేడిన్ చెన్నై వర్కవుట్ కాకపోవటంతో ఈ చిత్రంలో ఎలాగైనా ప్రభాస్ కి హిట్టు ఇవ్వాలని పూరీ పట్టుదలతో పనిచేస్తున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభాస్ సైతం తమ సొంత చిత్రం భిల్లా ఎంత హంగు ఆర్బాటాలతో తీసినా ఊహించిన విజయం సాధించకపోవటంతో ఏక్ నిరంజన్ పైనే కాన్సర్ టేట్ చేసినట్లు చెప్తున్నారు. ఇవన్ని ఇలా ఉంటే బాలీవుడ్ కిడ్నాప్ బాల్చీ తన్నేసింది కాబట్టి ఆ పాయింట్ ఎత్తుకున్నా పూరీ తన దైన శైలిలో మార్చి మశాలా వేస్తేనే ఎక్కుతుందనేది నిజం.