Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రాణం తీసిన అభిమానం, ప్రభాస్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం
నిజామాబాద్: తమ హీరో పుట్టిన రోజు వేడక అంటే మిగతా హీరోల వాటికన్నా బాగా చేయాలని ఫ్యాన్స్ ప్లాన్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తూంటాయి. అయితే ఊహించని విధంగా అవి ప్రమాదాలకి దారి తీస్తూంటాయి.
హీరో పుట్టినరోజుకి, కొత్త సినిమాకి హంగామా చేసే ఈ ఫ్యాన్స్ ఒక్కోసారి తమ ప్రాణాలకే తెచ్చుకుంటారు. మొన్నామధ్య ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన వివాదం, హత్య మరవకముందే మరో హీరో అభిమాని ప్రమాదవసాత్తూ మృతి చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాలో ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో విషాదం నెలకొంది. ఆదివారం (అక్టోబర్ 23న) బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్లోని అభిమానులందరూ అతని జన్మదిన వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు.
ఈ వేడుకల సందర్భంగా అభిమానుల్లో ఒకడైన ప్రశాంత్ (19) అనే యవకుడు తన అభిమాన హీరో ఫ్లెక్సీని కడుతుండగా ఆకస్మాత్తుగా విద్యుత్ వైర్లు తగలడంతో షాక్ తగిలింది. విద్యుత్ షాక్తో అభిమాని ప్రశాంత్ అక్కడిక్కడే మృతిచెందినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటన గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. ఈ వార్తతో ప్రబాస్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. ఇంకా ఈ విషయమై హీరో ప్రభాస్ స్పదించలేదు. త్వరలో స్పందిస్తారని అభిమాన సంఘాలు భావిస్తున్నాయి.