Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
కెన్యా గవర్నమెంట్ నుంచి ప్రభాస్ కు లెటర్, ఏముంది అందులో
హైదరాబాద్: ప్రభాస్ కి కెన్యా ప్రభుత్వం ఎప్రిషియేషన్ లెటర్ ని పంపింది. ఆయన రీసెంట్ గా ఆ దేశాన్ని సందర్బించటంతో అక్కడి గవర్నర్ ఈ లెటర్ పంపటం జరిగింది. ఈ లెటర్ ని మీరు ఈ క్రింద చూడవచ్చు. బాహుబలి చిత్రం షూటింగ్ కు వేసవి శెలవలు ప్రకటించటంతో తన స్నేహితులతో కలిసి ప్రభాస్ కెన్యా వెళ్లారు. ఆయన అక్కడ రెండు వారాలు ఉన్నారు.
అక్కడ నేషనల్ రిజర్వ్ అయిన Maasai Mara కి వెళ్లటం జరిగింది. Maasai Mara ఆఫ్రికాలో అతి పెద్ద వైల్డ్ లైఫ్ రిజర్వ్. చాలా అద్బుతమైన ప్రాంతం. ట్రావలెర్స్ ఎక్కువగా దీన్ని సందర్శిస్తూంటారు. సింహాలు, చిరుతపులలు వంటి వైల్డ్ జంతువులకు ప్రసిద్ది. ప్రభాస్ అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసారని సమాచారం.
ప్రభాస్ అక్కడికి వచ్చి వెళ్లారనే విషయం తెలుసుకున్న అక్కడి గవర్నమెంట్...ఆయనకు ఎప్రిషియేషన్ లెటర్ రాసింది. ఈ లెటర్ లో మరో సారి ఈ ప్రాంతానికి రమ్మనమని,షూటింగ్ లు కూడా చేసుకోవచ్చుని, పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పుకొచ్చింది.
'బాహుబలి-2'కి సమ్మర్ ఎఫెక్ట్ తీవ్రంగా సోకింది. మండే ఎండల కారణంగా రాజమౌళి ఈ సినిమా షూటింగ్కు సుమారు నెలరోజులపాటు బ్రేక్ ఇవ్వాలని ఇటీవలే మేకర్స్ నిర్ణయించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ బ్రేక్ను మొత్తం 45 రోజులకు పెంచినట్టు తెలుస్తోంది. మే నెల 1 నుంచి జూన్ 15 వరకు యూనిట్ షూటింగ్ నిలిపివేస్తుందని దర్శకుడు రాజమౌళి, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ ప్రకటించారు.
బ్రేక్ ఇచ్చిన సమయంలో రాజమౌళి తన ఫ్యామిలీతో ఆస్ట్రేలియా వెళ్తాడని, హీరో ప్రభాస్ యూఎస్కు,ఆఫ్రికా, ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ కూడా ఫారిన్ ట్రిప్ పెట్టుకున్నారని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 45 డిగ్రీల సెల్సియస్కు టెంపరేచర్ చేరుకోవడంతో ఇక 'బాహుబలి-2' యూనిట్కు రెస్ట్ ఇవ్వక తప్పింది కాదు. ఏది ఏమైనా 2017 ఏప్రిల్ 14న మూవీ రిలీజ్ చేయాలన్న నిర్ణయానికి మేకర్స్ కట్టుబడి ఉన్నారు.