Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి దర్శకత్వంలో ప్రభాస్-గోపిచంద్ ‘పార్ట్ నర్స్’..!?
పూరీ జగన్నాథ్ హిందీ చిత్రం 'షోలే"ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ హీరోలుగా మంచి బాడీ పర్సనాలిటీ మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలైన ప్రభాస్, గోపిచంద్ కాంబినేష్ లో పూరీ జగన్నాథ్ రూపొందించాలని భావిస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్ ఇంతకు మందే 'వర్షం"లో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకొన్న గోపిచంద్ ఇండస్ట్రీలో ఓ అగ్రసీవ్ హీరోగా వెలుగొందుతున్నాడు.
అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ మల్టీస్టారర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబందించి 'పార్ట్ నర్" పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్వతి మిల్టన్, బిందుమాధవి హీరోయిన్స్ గా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.