twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరి దర్శకత్వంలో ప్రభాస్-గోపిచంద్ ‘పార్ట్ నర్స్’..!?

    By Sindhu
    |

    పూరీ జగన్నాథ్ హిందీ చిత్రం 'షోలే"ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన ఈ సినిమాకి ఇప్పటికీ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ హీరోలుగా మంచి బాడీ పర్సనాలిటీ మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలైన ప్రభాస్, గోపిచంద్ కాంబినేష్ లో పూరీ జగన్నాథ్ రూపొందించాలని భావిస్తున్నాడట. ఈ ఇద్దరి కాంబినేష్ ఇంతకు మందే 'వర్షం"లో ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మంచి క్రేజ్ తెచ్చుకొన్న గోపిచంద్ ఇండస్ట్రీలో ఓ అగ్రసీవ్ హీరోగా వెలుగొందుతున్నాడు.

    అయితే ఇప్పుడు ఇదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఈ మల్టీస్టారర్ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబందించి 'పార్ట్ నర్" పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పార్వతి మిల్టన్, బిందుమాధవి హీరోయిన్స్ గా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X