Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుకుమార్, ప్రభాస్ సురేంద్రరెడ్డి కలిసి... (ఫొటోలు)
హైదరాబాద్: నాకు వర్షం సినిమా నుంచి తెలుసు. ఇప్పుడు హీరో అయిపోయాడు అంటున్నారు ప్రభాస్. ఎవరి గురించి ఈ మాటలను ప్రభాస్ అన్నాడంటారు మరెవరు గురించి రీసెంట్ గా లవర్స్ గా హిట్ కొట్టిన ఎమ్.ఎస్ రాజు గారు కుమారుడు సుమంత్ అశ్విన్ గురించి. సందర్భంగా సుమంత్ అశ్విన్ తాజా చిత్రం చక్కిలిగింత ఆడియో లాంచ్ లో. ఇప్పుడా ఆ విశేషాలు చూద్దాం.
ఇలవాల ఫిలిమ్స్ సమర్ఫణలో మహిస్ ఎంటర్ట్నైమెంట్స్ ప్రెవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం చక్కిలిగింత. సుమంత్ అశ్విన్, రెహనా హీరో,హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రానికి వేమారెడ్డి దర్శకుడు. మిక్కీజే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ..శిల్ప కళా వేదికలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రభాస్, సుమంత్, ఎమ్మెస్ రాజు, సుకుమార్ , మారుతి, సురేంద్ర రెడ్డి వంటి వారు పాల్గొని విజయవంతం చేసారు. పాటలు కూడా చాలా బాగున్నాయి.
స్లైడ్ షో లో పంక్షన్ ఫొటోలు..
బ్యానర్ లోగో ఆవిష్కరణ
ప్రముఖ దర్శకుడు, చక్కిలిగింత దర్శకుడు వేమారెడ్డి స్నేహితుడు అయిన సుకుమార్ ,మరో ప్రముఖ దర్శకుడు సురేంద్ర రెడ్డి కలిసి బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.
సీడీ అవిష్కరణ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం బిగ్ సిడీ, ఆడియో సీడిని ఆవిష్కరించి, మాట్లాడారు. వర్షం నుంచి తనకు హీరోతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.
తొలి సీడి స్వీకరణ
ప్రభాస్ చేతుల మీదుగా.. సుకుమార్ తొలిసీడిని అందుకున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు.
ప్రభాస్ మాట్లాడుతూ...
టీజర్ చాలా బావుంది. సుమంత్ లాస్ట్ పిక్చర్ పెద్ద హిట్టైంది. ఈ సినిమా ఇంతకన్నా పెద్ద హిట్ అవ్వాలి. ఎమ్మెస్ రాజు గారి బ్యానర్ లో వర్షం చిత్రం చేసాను. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
సుకుమార్ మాట్లాడుతూ..
టైటిల్ చాలా బాగుంది. నేను, వేమారెడ్డి, ప్రకాష్ ముగ్గురుం క్రోన్ లాంటివాళ్లం. నేను మెటిలియలిస్టిక్ అయితే వేమారెడ్డి రియలిస్టిక్ అండ్ సెన్సిటివ్. తను మాట్లాడే మాటలు చాలా పిలాసఫికల్ గా ఉంటాయి. అందరూ నిద్రపోయాక ఆ మాటలు పుస్తకంలో రాసుకునే వాడిని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...
వేమారెడ్డి, సుమంత్, నిర్మాలకు అభినందనలు. సినిమా పెద్ద విజయం సాధించాలి అన్నారు.
దర్శకుడు వేమారెడ్డి మాట్లాడుతూ...
ఈ సినిమాకు సపోర్ట్ చేసిన నటీనటులందిరకీ, సాంకేతిక నిపుణులందరికీ ధాంక్స్ అన్నారు.
రెహనా మాట్లాడుతూ...
నా మొదటి తెలుగు సినిమా. పెద్ద టీమ్ తో పనిచేసినందకు చాలా హ్యాపీగా ఉంది. అవకాసం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధాంక్స్ అన్నారు.
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ...
నా ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు, నిర్మాత దిల్ రాజు, డైరక్టర్ సుకుమార్ గారు అందరూ ఈ పంక్షన్ కు రావటం ఆనందంగా ఉంది. వీరందరూ కలిసి సినిమా చేస్తే చాలా బాగుంటుంది.
మిక్కీ జే మేయర్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధాంక్స్. పెద్ద విజయం సాధించాలి అన్నారు.
ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ..
దర్శక,నిర్మాతలకు, టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని శుభాకాంక్షలు తెలిపారు.
వనమాలి మాట్లాడుతూ...
మిక్కీతో హ్యాపీ డేస్ నుంచి పరిచయం. ఈ చిత్రం డైరక్టర్ వేమారెడ్డి, నిర్మాతలకు పెద్ద హిట్టై మంచి పేరు తేవాలి అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ మాట్లాడుతూ...
ఈ సినిమాలో అవకాసం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధాంక్స్ అని చెప్పారు.
సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ...
వేమారెడ్డి నాకు పదేళ్లుగా తెలుసు. పెద్ద హిట్ కొడతాడు. పెద్ద డైరక్టర్ అవుతాడు. రేసుగుర్రం సినిమాకు డైలాగులు రాసాడు. నిర్మాతలకు ఈ సినిమాతో పెద్ద హిట్ వచ్చి..ఈ బ్యానర్ లో నేను సినిమా చేయాలి అన్నారు.
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ...
వేమారెడ్డి సహకారంతో పాటలన్నీ బాగా వచ్చాయి. ఆడియో, సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
కిషోర్ పార్దసాని మాట్లాడుతూ...
వేమారెడ్డి నేను డైరక్ట్ చేసిన తడాఖా సినిమాకు పనిచేసాడు. తను సెన్సిబుల్. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
బి.వి.ఎస్. ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ...
చక్కిలిగింత సినిమా సూపర్ హిట్ కావాలి. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
చిత్రంలో...
చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, సప్తగిరి, తాగుబోతు రమేష్, జోష్ రవి, వైవా హర్ష, వేణు, శ్రీమన్నారాయణ, అంబటి శ్రీను, నవీన్ తారాగణంగా ఈ చిత్రం రూపొందింది.