షాకింగ్: ముంబైలో వర్జినిటీ కోల్పోయిన ప్రభాస్
హైదరాబాద్: మీరు విన్నది నిజమే. హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘బాహుబలి' ప్రమోషన్లలో భాగంగా ముంబైలో తిష్టవేసిన సంగతి తెలిసిందే. అయితే మనోడు ఇక్కడ ఒకటి కోల్పోయాడు. ‘రేడియో వర్జినిటీ' కోల్పోయాడు
. ఈ విషయాన్ని తెలియజేస్తూ ముంబై రేడియో సిటీ జాకీ సుచరిత త్యాగి ట్వీట్ చేసింది. ఎందుకంటే ప్రభాస్ ఇలా రేడియో కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి
.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ విడుదల సమయం దగ్గర పడుతోంది. మరో 20 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇదో పెద్ద సినిమా కాబట్టి ఏ చిన్న అవకాశాన్ని వదలుకోవడం లేదు.
జులై 10వ తేదీన బాహుబలి సినిమా ప్రపంచ వ్యప్తంగా తెలుగు, తమిళం, హిందీ మళయాలంతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా ఎక్కవ మంది ప్రేక్షకులు రీచ్ కావడానికి విదేశాల్లో ఆయా భాషల్లో విడుదలువున్న ఈ చిత్రాన్ని సబ్ టైటిల్స్ అటాచ్ చేసి విడుదల చేస్తున్నారు.

వాస్తవానికి సౌత్ లో సినిమా ప్రమోషన్లు అంత సీరియస్ గా తీసుకోరు. కానీ బాలీవుడ్లో అలా కాదు. సినిమా ప్రమోషన్స్ చాలా సీరియస్ గా నిర్వహిస్తారు. సల్మాన్, షారుక్ లాంటి స్టార్స్ సైతం స్వయంగా ప్రమోషన్లలో పాల్గొంటారు. హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న కరణ్ జోహార్ బాలీవుడ్లో ప్రమోషన్స్ బాగా నిర్వహించాలని సీరియస్ గా చెప్పడంతో ప్రభాస్, రానా, తమన్నా ముంబైలో ఇప్పటికే తమ పని మొదలు పెట్టారు. తమన్నా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. బాహుబలి సినిమా ఆమెకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్లో భాగంగా స్వయంగా తానే యాంకర్ అవతారం ఎత్తింది.


Click it and Unblock the Notifications











