Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మంచు వారింట ప్రభాస్ సందడి.. ఎందుకు వెళ్లారో తెలుసా..?
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచు వారింట సందడి చేశారు. శనివారం మంచు విష్ణు ఇంటికి కెళ్లిన ఆయన, వారితో సరదాగా గడిపారు. ఈ మేరకు సదరు పిక్స్ మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇంతకీ మంచు విష్ణుతో ప్రభాస్ మీట్ కావడానికి కారణం ఏంటి? వివరాల్లోకి పోతే..
అదంతా కామన్.. కానీ ఇదే అరుదు
స్టార్ హీరోలు ఒకరినొకరు కలుసుకోవడం, సరదాగా గడపడం చూసి ఫిదా అవుతుంటారు వారి వారి ఫ్యాన్స్. సాధారణంగా ఇలాంటి సందర్భాలు ఏ ఆడియో ఫంక్షన్స్ లోనో లేక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనో చోటు చేసుకుంటాయి. కానీ నేరుగా ఓ హీరో ఇంటికి మరో హీరో వెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా ప్రభాస్, అంన్చు విష్ణు విషయంలో అదే జరిగింది.
మంచు ఫ్యామిలీతో ప్రభాస్.. ఆ టైమ్లోనే
మంచు ఫ్యామిలీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్కి మంచి సంబంధాలున్నాయి. గతంలో మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ' సినిమాకు వాయిస్ అందించాడు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో మోహన్ బాబు ఓ ముఖ్యపాత్రలో నటించారు. ఈ టైమ్ లోనే మంచు కుటుంబానికి ప్రభాస్ బాగా దగ్గరయ్యారని టాక్.
పండగ పార్టీ.. అందుకే ప్రభాస్
దీపావళి పండగ సందర్బంగా మంచు విష్ణు గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ప్రభాస్ని ప్రత్యేకంగా ఆహ్వానించాడు విష్ణు. ఈ మేరకు మంచు విష్ణు పార్టీకి అటెండైన యంగ్ రెబల్ స్టార్.. మంచు వారితో సరదా సరదాగా గడిపారు.
|
ప్రభాస్.. నా సోదరుడు అంటూ విష్ణు
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మంచు విష్ణు. ‘నా సోదరుడు ప్రభాస్తో చాలా రోజుల తర్వాత సరదాగా గడిపాను. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకూ చాలా సంతోషంగా గడిచింది' అని మంచు విష్ణు పేర్కొన్నాడు. మరోవైపు విష్ణు సతీమణి విరానికా కూడా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి.
సాహో తర్వాత ప్రభాస్
ఇటీవలే ‘సాహో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం ఓ వింటేజ్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. దేశ విదేశాల్లోని అందమైన లొకేషన్స్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.