Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభాస్ 'మిర్చి' రిలీజ్ డేట్ మారింది
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా రచయిత కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం 'మిర్చి'. ఈ చిత్రం పిబ్రవరి 7న రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్క రోజు తేడాగా అంటే పిప్రవరి 8న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లు.
ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమాలో ప్రభాస్ వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఆయన లుకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. తొలిసారిగా ఆయన కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో సినిమాని నిర్మించాం. కథ మీద కమాండ్తో హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్తో దర్శకుడు శివ చిత్రాన్ని రూపొందించారు.
గరం గరం మిర్చి తినడానికి ఎంత బాగుంటుందో అలాగే మా 'మిర్చి' సినిమా చూసి జనం అంత ఎంజాయ్ చేస్తారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సంగీత ప్రియులను అలరిస్తోంది' అని తెలిపారు. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం'రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యామీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్కుమార్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.