Don't Miss!
- News లోక్సభ ఎన్నికల తర్వాత గందరగోళమే: ఉద్యమ కేసీఆర్ను చూస్తారంటూ బీఆర్ఎస్ అధినేత
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒకే ఫ్రేమ్లో ప్రభాస్, యష్.. సలార్ కోసం రాజమౌళి కూడా..
రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా దర్శకులే ఎక్కువగా అవసరం అవుతున్నారు. బహుబలి లాంటి సినిమా తరువాత ఆడియెన్స్ ప్రభాస్ నుంచి అంతకు మించి అనేలా సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. ఇక ప్రభాస్ కూడా అదే స్థాయిలో కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే.. ఇక ఆ సినిమా లాంచ్ కావడానికి సిద్ధమైంది.
దర్శకుడిపై నమ్మకంతో..
KGF విడుదల కాకముందే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ సినిమా స్పీడ్ పెంచేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కథపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ప్రభాస్ దర్శకుడిపై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆడియెన్స్ కు మంచి కిక్కిచ్చింది.
త్వరలోనే సలార్
ఇక సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అనే విషయంలో అభిమానులు కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు. ఎందుకంటే ప్రభాస్ రాధేశ్యామ్ అనంతరం వెంటనే నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా లేదా ఆదిపురుష్ సినిమాలతోనే బిజీ కావచ్చని అనుకున్నారు. కానీ ఇప్పుడు సలార్ ను కూడా సెట్స్ పైకి తేవడానికి సిద్ధమయ్యాడు అంటే సినిమా ఏడాది తరువాత రావచ్చని ఆడియెన్స్ నమ్మకం పెట్టుకుంటున్నారు.
డేట్ ఫిక్స్ అయ్యింది
ఫైనల్ గా ప్రాజెక్టును లాంచ్ చేయడానికి టైమ్ అండ్ డేట్ ను సెట్ చేసుకున్నారు. హైదరాబాద్ లోనే జనవరి 15న అంటే ఈ శుక్రవారం ప్రాజెక్టును పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయడానికి ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
ఒకే ఫ్రేమ్ లో యష్, ప్రభాస్
ఇక ప్రభాస్, యష్ లాంటి పవర్ఫుల్ హీరోస్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. శుక్రవారం ఉదయం 11గంటలకు అదే సీన్ కనిపించబోతోంది. ఎందుకంటే రాజమౌళి, యష్ ఈ లాంచ్ ఈవెంట్ కు ప్రత్యేక అతిధులుగా రాబోతున్నారు. వారికి సంబంధించిన ఫొటోలు రిలీజ్ అయితే అభిమానులకు మరో పండగ బోనస్ ఇచ్చినట్లే.. చూడాలి మరి ఫొటోలు ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో..