కృష్ణం రాజు గర్వంగా, ప్రభాస్ ఎవరెవర్ని కలిసారు? (ఫోటోస్)
హైదరాబాద్: బాహుబలి సినిమా ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. మూడోవారంలోనూ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతూ దూసుకెలుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులతో బాహుబలి థియేటర్లు కళకళలాడుతున్నాయి.
బాహుబలి సినిమా భారీ విజయం సాధించడం, ఇండియాలోనే టాప్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలవడంతో ప్రభాస్ ఫ్యామిలీ చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ ను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ ప్రముఖులందరినీ కలిసాడు. నా వారసుడు బహుబలి అంటూ గర్వంగా చెప్పుకున్నాడు. ఆ సయమయంలో ఆయన ముఖంలో ఆనందం మాటల్లో వర్ణించలేనిది.
ప్రధాని నరేంద్ర మోడీతో పాటు...తన మిత్రులైన కేంద్ర మంత్రులతో కృష్ణం రాజు సమావేశం అయ్యారు. ఇప్పటి వరకు కృష్ణం రాజు, ప్రభాస్ ఎవరెవర్ని కలిసారనే విషయాలు స్లైడ్ షోలో...

ప్రధానితో
ప్రధాని నరేంద్ర మోడీతో బాహుబలి ప్రభాస్

ప్రభాస్ ఫ్యామిలీతో..
తన పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి ప్రభాస్ ప్రధాన మంత్రిని కలిసిన దృశ్యం.

అద్వానీతో..
బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీతో కలిసి కృష్ణం రాజు, ప్రభాస్.

అరుణ్ జైట్లీ..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి కృష్ణం రాజ్, ప్రభాస్

అమిత్ షా
బీజేపీ నేత అమిత్ షాతో కలిసి ప్రభాస్, కృష్ణం రాజు.

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తో కలిసి కృష్ణం రాజు, ప్రభాస్

అజయ్ దేవగన్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో కలిసి కృష్ణం రాజు, ప్రభాస్.


Click it and Unblock the Notifications











