Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్-పూరి ముచ్చటగా మూడోసారి!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ చిత్రాలు బక్సాఫీసు వద్ద బురిడి కొట్టాయి. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ప్రభాస్ 'మిర్చి' చిత్రం చేస్తుండటంతో పాటు... ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. వీటి తర్వాత ప్రభాస్-పూరి చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలపాల్, కేథరిన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో పూరి స్టయిల్ లో ఈచిత్రం సాగుతుంది.
ఇద్దరు అమ్మాయిలతో ఫారిన్ లో ప్రేమలో పడి వారితో హీరో పడే పాట్లు... అనే పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, నృత్యాలు: దినేష్, కళ: చిన్నా, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్ వర్మ.