Don't Miss!
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్నBird Flu పాలు, గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రభాస్ కి సోదరుడుగా దగ్గుపాటి రానా ఖరారు
హైదరాబాద్: రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో దగ్గుపాటి రానా ని విలన్ గా అడుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రీసెంట్ గా చర్చలు జరిగి ఓకే అయ్యిందని తెలిసిందే. కథలో రానా పాత్ర కీలకంగా ఉండనుందని సమాచారం. ప్రభాస్ పాత్రకు రానా సోదరుడు అని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... ప్రభాస్ హీరోగాగా ఆర్కా మీడియా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తారు. అనుష్క హీరోయిన్ . ఈ చిత్రంలో విలన్ పాత్రకు రానా దగ్గుబాటి ఎంపికయ్యారు. గత కొద్ది రోజులుగా రానా విషయమ్మీద ప్రచారం సాగుతోంది. ఇటీవలే రానా, రాజమౌళి మధ్య చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. హీరోకి సోదరుడిగా రానా పాత్ర ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు.
ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం భారీ జానపద చిత్రరాజమని తెలుస్తోంది. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో ఆర్కామీడియా ఈ సినిమాను తెరకెక్కించనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్కు తరలించనున్నారని కూడా సమాచారం.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.