Don't Miss!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ ‘రెబల్’ విడుదల మళ్లీ వాయిదా
హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు లారెన్స్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'రెబెల్'. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. తొలుత ఈచిత్రం ఆడియో సెప్టెంబర్ 5న, సెప్టెంబర్ 21న సినిమాను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.....పోస్టు ప్రొడక్షన్ పనులు లేటవుతుండటంతో సెప్టెంబర్ 14న ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.
తమన్నా, దీక్ష సేథ్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లారెన్స్ సంగీతం కూడా తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. మార్తాండ్.కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటుండగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.
మాస్ మసాలా ఎంటర్ టైనర్గా రూపొందుతున్న ఈచిత్రం ప్రభాస్ అభిమానుల టేస్టుకు తగిన విధంగా రూపొందిస్తున్నారు దర్శకుడు లారెన్స్. ఈచిత్రాన్ని జె. పుల్లారావు, జె. భగవాన్ శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు.