Don't Miss!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ప్రభాస్ ‘మిర్చి’ ఆడియో రిలీజ్ పోస్టర్ కేక..!
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'మిర్చి' ఆడియో జనవరి 5న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఆడియో వేడుక చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభాస్కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణాన్ని ఎక్కువమంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, 'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ యు.వి. క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ సంయుక్తంగా 'మిర్చి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది చిత్రం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన ఆడియోని జనవరి 5న విడుదల చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ప్రభాస్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. కథ మీద కమాండ్తో దర్శకుడు కొరటాల శివ ప్రతి సన్నివేశాన్ని చక్కగా చిత్రీకరించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటుందని ఆశిస్తున్నామ'ని తెలిపారు.
సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, రఘుబాబు, 'సత్యం' రాజేష్, శ్రీనివాసరెడ్డి, సంపత్ కుమార్, ఆదిత్యా మీనన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్ కుమార్, నిర్మాతలు: వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కొరటాల శివ.