Don't Miss!
- News సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే
- Finance Just Dial Stock: జస్ట్ డయల్ స్టాక్ రికార్డుల మోత.. ఇంట్రాడేలో 13 శాతం అప్.. అదే కారణం..
- Automobiles టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
- Technology ధర రూ. 20 వేలలో, వైర్లెస్ ఛార్జింగ్ తో వచ్చే మొట్ట మొదటి ఫోన్! సేల్ ఈ రోజే! ఆఫర్ వివరాలు
- Sports IPL 2024: అంబానీ వల్ల మూడు జట్లు సర్వనాశనం!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
ప్రభాస్ అరుదైన ఘనత.. దేశంలోనే మొదటి స్థానం కైవశం.. ఓవరాల్గా సెకెండ్ ప్లేస్.!
'ఈశ్వర్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభంలోనే సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వరుస పరాజయాలతో సతమతం అయ్యాడు. ఆ తర్వాత 'డార్లింగ్' సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి'తో ప్రభాస్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా వల్ల అతడు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. అదే సమయంలో మార్కెట్ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో ఓ అరుదైన ఫీట్ను సాధించాడు. ఇంతకీ ఏంటా ఫీట్.? వివరాల్లోకి వెళితే...
ఎన్నో అంచనాలతో వస్తే.. చివరికిలా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సాహో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినప్పటికీ వాటిని అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతలకు నష్టాలు వచ్చాయని ట్రేడ్ వర్గాల్లు వెల్లడించాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సుజిత్ రూపొందించాడు.
అక్కడ మాత్రం రికార్డులు బద్దలు
‘సాహో' తెలుగు, హిందీ సహా పలు భాషల్లో రూపొందింది. విడుదలైన అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ, లాంగ్ రన్లో కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. అయితే, హిందీలో మాత్రం ఈ మూవీ దుమ్ము దులిపేసింది. దాదాపు రూ. 200 కోట్లు కలెక్ట్ చేసి 2019లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది.
ప్రభాస్ సినిమాకు రెండో స్థానం
స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘సాహో' మూవీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షో తాజాగా ఈ ఏడాది ట్రెండింగ్ మూవీస్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘సాహో' రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్: ది ఎండ్ గేమ్' మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది.
భారతదేశంలో ప్రభాసే టాప్
ఈ జాబితాలో హాలీవుడ్ మూవీస్ను తీసేస్తే ‘సాహో' భారతదేశం నుంచి మొదటి స్థానం కైవశం చేసుకుంది. అలాగే, మూడో స్థానంలో ఇళయదళపతి విజయ్ నటించిన ‘బిగిల్', బాలీవుడ్ హీరోలు హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్' నాలుగో స్థానంలో నిలిచాయి. అలాగే, మరో హాలీవుడ్ సినిమా ‘కెప్టెన్ మార్వెల్' ఐదు, ‘సైరా: నరసింహారెడ్డి' ఆరో ర్యాంక్ను సొంతం చేసుకున్నాయి.
ప్రభాస్ పూర్తిగా మారిపోయాడు
ప్రస్తుతం ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. 1960 దశకం నాటి విదేశీ ప్రేమకథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో యంగ్ రెబెల్ స్టార్ లవర్ బాయ్గా కనిపించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.