చిరంజీవి, అక్షయ్ కుమార్తో ప్రభాస్ ఢీ.. నువ్వా నేనా అన్నట్టు..
బాహుబలి2 సినిమా రిలీజ్ అనంతరం దాదాపు రెండేళ్ల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం రిలీజ్ కానున్నది. ఈ సినిమాను 2019 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ వెల్లడించింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతున్న సాహోకు అన్ని రకాలుగా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది.
ఆగస్టు 15వ తేదీన అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ చిత్రం విడుదల కాబోతున్నది. ఈ చిత్రం మంగళ్యాన్ ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తల జీవితం ఆధారంగా ఈ సినిమా రిలీజ్ కానున్నది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా చిత్రం కూడా ఆగస్టు 15వ తేదీన రిలీజ్కు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ముగ్గురు సూపర్స్టార్లు బాక్సాఫీస్ వద్ద భారీగానే తలపడటం ఖాయం. ఈ పోరులో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాల్సిందేనని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











