Don't Miss!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
జపాన్ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రభాస్
బాహుబలి సినిమా ఎఫెక్టుతో జపాన్లో కూడా ప్రభాస్కు భారీగా అభిమానులు ఏర్పడ్డారు. దీంతో అక్కడ తన ఫ్యాన్ బేస్ మరింత విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు యంగ్ రెబల్ స్టార్. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వారికి న్యూఇయర్ గ్రీటింగ్స్ పంపారు.
కొత్త సంవత్సర వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆంకాంక్షిస్తూ... ప్రభాస్ తన ఫోటోలతో తయారు చేయించిన గ్రీటింగ్ కార్డులపై జపనీస్ భాషలో విష్ చేస్తూ వాటిని పంపారు. తాము అభిమానించే స్టార్ నుంచి గ్రీటింగ్స్ రావడంతో జపనీయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
ప్రభాస్ పంపిన గ్రీటింగ్స్ ఇవే...
ప్రభాస్ పంపిన గ్రీటింగ్ కార్డ్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులకు ప్రభాస్ ఎంత వ్యాల్యూ ఇస్తారో చెప్పడానికి ఇదొక ప్రత్యక్షనిదర్శమని చెబుతున్నారు. హైదరాబాద్లో ఉంటే తనను కలవడానికి వచ్చే అభిమానులు ప్రభాస్ ఏమాత్రం నిరాశ పరచడని, వారితో కలిసి తప్పకుండా ఫోటోలు దిగుతారని ఫ్యాన్స్ అంటున్నారు.
2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!
సాహో..
ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్లో బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని జపాన్లో విడుదల చేసే అవకాశం ఉంది.
8 నెలలు వెయిట్ చేయాల్సిందే
‘సాహో' చిత్రం ఇండియన్ సినీమా చరిత్రలోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. సినిమాలో యాక్షన్ సీన్లు ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, జపనీస్ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.
సాహో తర్వాత
‘సాహో' తర్వాత ప్రభాస్ ‘జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. పూజా హెగ్డే హీరోయిన్. యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.