Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇంకొకటి కూడా మొదలుపెట్టేస్తున్న ప్రభాస్.. ఏది ముందు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. భారీ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు 150 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ప్రభాస్ బాహుబలి తరువాత చేస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తునట్లు తెలుస్తోంది. ప్రస్తతం సాహో చిత్ర యూనిట్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వద్ద షూటింగ్ జరుపుకుంటోంది.
సాహో చిత్రం ఎప్పటికి పూర్తవుతుందో ఇంకా క్లారిటీ రావడంలేదు. సాహో చిత్ర విడుదలకు ఇంకా సమయం పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జులై 7 న ప్రభాస్ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం.
సాహి చిత్రం విడుదల ఆలస్యమైతే ఆలోపు ఈ చిత్రాన్ని పూర్తిచేసి ప్రభాస్ అభిమానులకు కానుకగా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాహుబలి 2 విడుదలై ఏడాది గడుస్తున్నా ప్రభాస్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. రాధా కృష్ణ దర్శకత్వం వహించే చిత్రంలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.