Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మళ్ళీ సాహో పద్ధతినే ఫాలో అవుతున్న ప్రభాస్ టీమ్
రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత అయినా స్పీడ్ పెంచుతాడేమో అనుకుంటే మళ్ళీ ఎప్పటిలానే అభిమానుల ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. అభిమాన హీరోను ఎమనలేక ఆయనతో సినిమాలను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పై ఫ్యాన్స్ కోపాన్ని చూపిస్తున్నారు అనే టాక్ కూడా వస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో యూవీ సంస్థను బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా ట్రెండ్ అయ్యింది అంటే అభిమానుల కోపం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ తన 20వ సినిమాను జిల్ దర్శకుడు రాధాకృష్ణతో చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ ప్లాన్ ఇంతవరకు సెట్ చేసుకోలేదు. కనీసం టైటిల్ కూడా సెట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కూల్ చేయడానికి టైటిల్ ఫస్ట్ లుక్ తో రాబోతున్నాడు అనే టాక్ వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే.. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు.
సాహో తరహాలోనే ఈ సినిమాకు కూడా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయనున్నారట. అందులో సైరాకు మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది ఇప్పటికే రెండు ట్యూన్స్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో మరో ఇద్దరు కంపోజర్స్ కూడా చిత్ర యూనిట్ తో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట. వీలైనంత వరకు ఎదో ఒక సాంగ్ ని రిలీజ్ చేయాలని యూవీ క్రియేషన్స్ ఆలోచిస్తోంది. మరి అభిమానులు ఆ స్పెషల్ అప్డేట్ తో ఎంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి.