Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మళ్ళీ సాహో పద్ధతినే ఫాలో అవుతున్న ప్రభాస్ టీమ్
రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత అయినా స్పీడ్ పెంచుతాడేమో అనుకుంటే మళ్ళీ ఎప్పటిలానే అభిమానుల ఓపికకు పరీక్ష పెడుతున్నాడు. అభిమాన హీరోను ఎమనలేక ఆయనతో సినిమాలను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ పై ఫ్యాన్స్ కోపాన్ని చూపిస్తున్నారు అనే టాక్ కూడా వస్తోంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో యూవీ సంస్థను బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా ట్రెండ్ అయ్యింది అంటే అభిమానుల కోపం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ తన 20వ సినిమాను జిల్ దర్శకుడు రాధాకృష్ణతో చేస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫుల్ ప్లాన్ ఇంతవరకు సెట్ చేసుకోలేదు. కనీసం టైటిల్ కూడా సెట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ప్రభాస్ కూల్ చేయడానికి టైటిల్ ఫస్ట్ లుక్ తో రాబోతున్నాడు అనే టాక్ వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే.. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు.
సాహో తరహాలోనే ఈ సినిమాకు కూడా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయనున్నారట. అందులో సైరాకు మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది ఇప్పటికే రెండు ట్యూన్స్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో మరో ఇద్దరు కంపోజర్స్ కూడా చిత్ర యూనిట్ తో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట. వీలైనంత వరకు ఎదో ఒక సాంగ్ ని రిలీజ్ చేయాలని యూవీ క్రియేషన్స్ ఆలోచిస్తోంది. మరి అభిమానులు ఆ స్పెషల్ అప్డేట్ తో ఎంతవరకు సంతృప్తి చెందుతారో చూడాలి.