Don't Miss!
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సాహో గురించి ప్రభాస్లో కంగారు.. ఆందోళనగా ఉందనేస్తూ షాక్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'సాహో'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్ సినిమాపై ఆసక్తిని పెంచుతూ సాహో అప్డేట్స్ ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సాహో సినిమాపై కంగారుగా ఉందంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
'సాహో' విషయంలో టెన్షన్గా ఉందా? అని తనను చాలామంది అడుగుతున్నారని చెప్పిన ప్రభాస్.. ఇంత భారీ బడ్జెట్తో సినిమా చేశాక టెన్షన్ లేకండా ఎలా ఉంటుంది? చెప్పండి అంటూ ఆసక్తికరంగా మాట్లాడాడు. 'సాహో' సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని, అలాగే రెండేళ్ల సమయాన్ని కేటాయించానని చెప్పారు ప్రభాస్.
ఇంత కష్టపడ్డాక ఏ యాక్టర్కైనా తగిన ఫలితం వస్తుందో లేదోననే ఆందోళన సహజంగానే ఉంటుందని, ఇన్ని రోజుల పాటు టీమ్ అంతా అహర్నిశలూ శ్రమించాం కాబట్టి సాహో విషయంలో ఆందోళన ఉందని అన్నారు ప్రభాస్. కాకపోతే సాహో సక్సెస్ పట్ల ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు ప్రభాస్.
ఇక సాహో సంగతులంటారా?.. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కింది సాహో సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. హీరోయిన్ శ్రద్ద కపూర్కి ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఈ సినిమా ఆగస్టు 30వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల కానుంది.