Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రేజీ న్యూస్..ప్రభాస్ని ఎట్టకేలకు ఒప్పించారు.. త్వరలోనే!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సినిమాల జోరు పెంచాడు. బాహుబలి చిత్రం కోసమే ప్రభాస్ దాదాపు 5 ఏళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం విడుదల కాకముందే రాధాకృష్ణ దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభమైంది. ఈ రెండూ భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రాలే. ప్రభాస్ ఎంత స్టార్ హీరోగా ఎదిగినా ఆయన అభిమానులకు మాత్రం ఓ కోరిక తీరకుండా అలాగే ఉండిపోయింది. అభిమానుల డిమాండ్ కు ప్రభాస్ ఎట్టకేలకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా యుగం
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సాధారణ మీడియా మాధ్యమాల కంటే వేగంగా సోషల్ మీడియాలో సమాచారం తెలిసిపోతోంది. చాలా మంది సెలెబ్రటీలు, తారలు అభిమానులకు చేరువగా ఉండేదుకు ఈ సామజిక మాధ్యమాలనే వేదికగా ఎంచుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మీడియాకు దూరంగా ఉండే వ్యక్తి. అందుకే ప్రభాస్ కు పేస్ బుక్ లో తప్ప మరే ఇతర సామజిక మాధ్యమాలలో అకౌంట్స్ లేవు.
అభిమానుల డిమాండ్
బాహుబలి తర్వాత ప్రభాస్ జాతీయస్థాయిలో క్రేజీ హీరోగా మారిపోయారు. దేశవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. వీరందరి నుంచి ఒక్కటే డిమాండ్.. ప్రభాస్ ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలలోకి రావాలి అని. అభిమానుల డిమాండ్ కు ప్రభాస్ ఎట్టకేలకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాస్ త్వరలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
సాహో విడుదల కంటే ముందే
ప్రభాస్ ని పేస్ బుక్ ఖాతాకు 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీనిని బట్టేఆ అర్థం అవుతోంది.. ప్రభాస్ ని సోషల్ మీడియాలో ఫాలో కావడానికి అభిమానులు ఎంతలా ఇష్టపడుతున్నారో అని. సాహో చిత్ర విడుదలకు ముందు ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ అభిమాన హీరోని ఇంస్టాగ్రామ్లో ఫాలో అయ్యేందుకు ప్రభాస్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు.
ఆగష్టు 15న విడుదల
ఇదిలా ఉండగా సాహో చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన షేడ్స్ ఆఫ్ సాహో వీడియోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. సాహో చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ రాధాకృష్ణ దర్శత్వంలోని చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్.