Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నదిలో విద్యార్థుల గల్లంతుపై స్పందిస్తూ ప్రభాస్ ట్వీట్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నదిలో వరద ఉధృతికి కొట్టుకు పోయి 24 మంది హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయిన సంగతి తెలిసిందే. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజి చెందిన వీరంతా ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం అక్కడికి వెళ్లారు. బియాస్ నది వద్ద ఫోటోలు దిగుతుండగా లర్జీ హైడ్రో పవర్ ప్రాజెక్టు డ్యాం గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వచ్చిన వరదలో వారు కొట్టుకుపోయారు.
కాగా...ఈ ఘటనపై తెలుగు సినిమా నటుడు ప్రభాస్ ట్విట్టర్ ద్వార స్పందించారు. 'ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం విషాదకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి విద్యార్థుల కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఉండటంతో విషాదం చోటు చేసుకుంది.
ప్రమాదం నుండి బయట పడ్డ 22 మంది విద్యార్థులను మనాలి నుంచి చండీగడ్ తరలించారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలిస్తారు. నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్లు మండి ఎస్పీ చెప్పారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపుచర్యలు నిలిపేసినట్లు ఆయన తెలిపారు.
బియాస్ నదీ తీరాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనుమతి లేకుండా లర్జీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసిన ఐదుగురు అదికారులను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.