Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మహేశ్ థియేటర్లో ప్రభాస్ సందడి.. ఫ్యాన్స్ హంగామా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ 'సాహో' విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ హైదరాబాద్లో మహేశ్ బాబు థియేటర్ ఏఎంబీ మాల్లో ఉన్న థియేటర్లో 'సాహో' సినిమాను వీక్షించేందుకు వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో ఆయన అక్కడకు చేరుకున్నాడు. దీంతో మాల్ సిబ్బంది ప్రభాస్కు ఘన స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, ప్రభాస్ థియేటర్కు రావడంతో అక్కడే ఉన్న అభిమానులు, సినీ ప్రియులు ఆయనను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. అంతేకాదు, విషయం తెలుసుకున్న చాలా మంది ఫ్యాన్స్.. మాల్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో ఏఎంబీ మాల్ దగ్గర కోలాహలం నెలకొంది.
మరోవైపు, ప్రభాస్ కూడా ఇటీవల ఓ థియేటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ఆయన సన్నిహితులైన యువి క్రియేషన్స్ వారు కలిసి సూళ్లూరుపేటలో 'వీ -సెల్యులాయిడ్ సంస్థ వి-ఎపిక్ అంటూ' ఓ భారీ మల్టీఫ్లెక్స్ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఓ భారీ తెర కలిగిన థియేటర్తో పాటు మరో రెండింటిని ఇందులోనే నిర్మించారు. సాహో చిత్రంతో ఈ మూడు థియేటర్లను ప్రారంభించారు. ఈ చిత్రం విడుదలకు ముందు రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ థియేటర్ను అధికారికంగా ప్రారంభించారు.