Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అప్పుడు అల్లు అర్జున్ను ఆడించింది.. ఇప్పుడు ప్రభాస్ను షేక్ చేయిస్తుంది
'బాహుబలి'తో తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ సాధించాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీని తర్వాత అతడు చేస్తున్న చిత్రమే 'సాహో'. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా చూపించాలని భావిస్తున్నాడు ఈ టాలీవుడ్ టాప్ హీరో. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
బడా టెక్నీషియన్లతో షూట్
ఈ సినిమా నాలుగు భాషల్లో వస్తుండడంతో చిత్ర యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగానే భారతదేశంలోనే టాప్ ప్లేస్లో ఉన్న టెక్నీషియన్లతో పాటు, విదేశాల నుంచి కొంత మందిని రప్పించారు. భారీ యాక్షన్ సీన్స్, గ్రాఫిక్ వర్క్ ఉండడంతో అత్యంత జాగ్రత్తగా షూట్ చేస్తున్నారు.
డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా..
ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ‘సాహో' అన్నీ గ్రాండ్గా ఉండాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్.. డ్యాన్స్ కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ను తీసుకున్నారు. ఈమె ఆధ్వర్యంలో కొద్దిరోజుల క్రితం ఆస్ట్రియాలో రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించారు. అలాగే, జాక్వలిన్ చేసే స్పెషల్ సాంగ్ కూడా ఈమెనే కంపోజ్ చేశారు.
గతంలో అల్లు అర్జున్ సినిమాకు..
అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య' సినిమాతో వైభవి మర్చంట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే స్లో మెలేడీ సాంగ్ కోసం ఈమె పని చేశారు. ఇప్పుడు దేశంలోనే భారీ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘సాహో' ప్రభాస్తో పని చేశారు. మొత్తానికి ఈ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఇద్దరు తెలుగు హీరోలతో డ్యాన్స్ చేయించారన్న మాట.
‘సాహో' గురించి
‘బాహుబలి' తర్వాత ప్రభాస్ చేస్తున్న చిత్రమే ‘సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనిని ‘రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో వస్తోంది.