Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రభుదేవా 'ముక్కాలా ముకాబులా...' మరోసారి
ఇక ప్రభుదేవా ప్రస్తుతం మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న చిత్రానికి పనిచేయబోతున్నారు. ఈ చిత్రంలోని పాటలకు నృత్య దర్శకత్వం ప్రభుదేవా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్న నేపథ్యంలో..... రాక్ స్టార్ పాత్రకు ముడి పడి ఉన్న రెండు పాటలకు ప్రభుదేవా నృత్య దర్శకత్వం చేయబోతున్నారు. ఈ పాటల్లో డాన్స్ కు అధిక ప్రాధాన్యత ఉండటంతో టాప్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవాను దర్శకుడు సుకుమార్ సంప్రదించడంతో వెంటనే ఓకే చేసారని సమాచారం.
'రౌడీరాథోడ్'తో హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'చిత్రం హిందీలోకి రామయ్య వస్తావయ్యా అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ విషయమై ప్రభుదేవా మాట్లాడుతూ...మేము ఈ చిత్రం కోసం కొత్త అమ్మాయిని అనుకున్నాము. అయితే శృతి హాసన్ బెస్ట్ ఛాయిస్ అనిపించింది అని చెప్పారు. ప్రస్తుతం ప్రభుదేవా ముంబైకి మకాం మార్చారు. బోనీకపూర్ ఖాళీ చేసిన వారి ఇంట్లో ఉంటున్నాడు.
ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది. త్రిష,సిద్దార్ద కాంబినేషన్ లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావించి చేస్తున్నారు.హిందీ రీమేక్కి కుమార్ తరౌనీ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ సినిమాతో ఆయన కుమారుడు గిరీష్ హీరోగా పరిచయం కాబోతున్నారు.